Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

త్వరలోనే తెలంగాణ పీఆర్సీ..

0

హైదరాబాద్, ఆగస్టు 4:ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభవార్త చెప్పారు. త్వరలోనే ఉద్యోగులకు వేతన సవరణ కమిషన్(పీఆర్‌సీ)తో పాటు మధ్యంతర భృతిని ప్రకటిస్తామని, ఈహెచ్సీ పక్కాగా అమలు చేస్తామని ఉద్యోగ సంఘాలతో జరిగిన భేటీలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 2వ పీఆర్సీ ని ఏర్పాటు చేసి, 2023 జూలై 1నుంచి అమలయ్యేలా ఏఆర్ ను ప్రకటించాలని ఉద్యోగులు కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. ఇవాళ లేదా రేపు అసెంబ్లీలో పీఆర్సీ కమిషన్ , మధ్యంతర భృతిపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ టీఎన్‌జీవోలు, తెలంగాణ ప్రభుత్వ అధికారుల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. పీఆర్సీ, హెల్త్ కార్డుల జారీ అంశాలపై వారితో మాట్లాడారు.. వారు అడిగిన ప్రశ్నలకు ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం.సమావేశం ముగిసిన తర్వాత  ఉద్యోగ సంఘాల నేతలు ఈ ప్రకటన చేశారు. త్వరలోనే పీఆర్సీతోపాటూ మధ్యంతర భృతి కూడా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని వెల్లడిచారు.

అలాగే ఉద్యోగులకు మెరుగైన హెల్త్ కార్డు సదుపాయంను కల్పించాలని చూస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ తెలిపారు. అందువల్ల అసెంబ్లీలో పీఆర్సీ, మధ్యంతర భృతిపై ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేస్తారనే టీఎన్‌జీవో నాయకులు అనుకుంటున్నారు. రెండో పీఆర్సీ ఏర్పాటు చేసి.. జులై 1, 2023 నుంచి అమల్లోకి తేవాలనీ, మధ్యంతర భృతిని ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ని అభ్యర్థించారు. పీఆర్సీతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ భీమాలో అవకాశాలు పెంచాలని.. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని, దీంతో మెరుగైన వైద్యం అందేలా ఈహెచ్‌ఎస్‌ను అందించాలని ఉద్యోగుల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వం తెచ్చిన పీపీఎస్ పెన్షన్ విధానాన్ని తొలగించి.. ఓపీఎస్‌ను తేవాలని ఉద్యోగులు కోరినట్లు సమాచారం.

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ప్రస్తుత సర్కార్‌కు ఇదే చివరి సెషన్‌, మరో మూడు నాలుగు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ్‌!. అందుకే, తాము చేసింది చెప్పుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం… వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయ్‌!. అయితే, అంచనాలకు భిన్నంగా సాగింది తొలిరోజు సెషన్‌. ఒకే ఒక్క సంతాప తీర్మానంతో శాసనసభ వాయిదాపడితే, మండలిలో మాత్రం వరదలపై లైట్‌ హీటెడ్‌ డిస్కషన్స్‌ జరిగాయ్‌!. ఇక, శాసనసభలో కూల్‌గానే కనిపించిన విపక్ష ఎమ్మెల్యేలు… హాట్‌ కామెంట్స్‌తో ఔట్‌సైడ్‌ హీట్‌ పుట్టించారు. సభ ముందుకు ఏడు కీలక బిల్లులు రానున్నాయి. భారీ వర్షాలు, వరదలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. మండలిలో విద్య, వైద్యంపై చర్చ జరగనుంది. దీంతోపాటు ఉద్యోగల డిమాండ్లపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie