Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

19 తర్వాత తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు.

0

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం జరుగుతోంది. ఏపీలోనే నైరుతి రుతుపవనాలు స్తంభించిపోయాయి. గత నాలుగు రోజులుగా అసలు ముందుకు కదలడం లేదు. అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన బిపోర్ జాయ్ తీవ్ర పెను తుఫాన్ కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడిపోయి ఏపీలోనే ఆగిపోయాయి. దీంతో తెలంగాణను ఆలస్యంగా తాకనున్నాయి.నెల 19 నాటికి తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారిణి శ్రావణి తాజాగా స్పష్టం చేశారు.

 

19వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశిస్తే అవకాశముందని అంచనా వేశారు. ఆ రోజున చేరుకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి వారం రోజుల సమయం పడుతుందని చెప్పారు. నైరుతి రుతుపవనాలు తాకగానే వెంటనే వర్షాలు పడవని, తొలకరి మొదలవ్వడానికి కొద్దిరోజుల సమయం పడుతుందని వాతావరణశాఖ చెబుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 10వ తేదీ నాటికి రాష్ట్రంలోకి ప్రతి ఏడాది రాష్ట్రంలోకి చేరుకుంటాయి. కానీ జూన్ రెండోవారం ముగిసినా ఇంకా రాష్ట్రానికి రాలేదు. రుతుపవనాల ఆలస్యం వల్ల తెలంగాణలో ఎండలు, వడగాలుల తీవ్రత మరింత పెరుగుతోంది.

 

ప్రతి ఏడాది జూన్ తొలివారం తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి.కానీ రుతుపవనాల జాప్యం వల్ల గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ ప్రభావంతో పాటు వడగాలుల వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాలంటేనే చాలామంది వెనకడుగు వేస్తున్నారు. దాదాపు చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. నైరుతి వచ్చేంతవరకు ఇలాగే వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. నైరుతి ప్రవేశించాక ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఇక తెలంగాణలో రానున్న రెండ్రోజుల పాటు కూడా భానుడి ప్రతాపంతో పాటు వడగాల్పులు వీయనున్నాయి.

ఒకే రోజు 71 తీర్పులు వెల్లడించిన జస్టిస్ నందా.

నేడు కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది.ఇక సూర్యాపేట, నల్లగొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని పేర్కొంది. రేపు కూడా ఈ జిల్లాల్లోనే వడగాల్పుల తీవ్రత ఉండనుంది. రాష్ట్రంలో నేడు, రేపు పొడి వాతావరణం ఉంటుందని, వర్షసూచన లేదని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. 19వ తేదీ తర్వాత రాష్ట్రంలో వర్షాలు పడతాయని అంచనా వేశారు. అప్పటివరకు ఎండ వేడిని భరించాల్సి ఉంటుందన్నారు. కాగా ఈ సారి నైరుతి రుతుపవనాల వల్ల సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie