పొంగులేటి కార్యాలయంలో శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆదివారం రేపు సాయంత్రం రాహుల్ గాంధీ ఖమ్మం రానున్నారు. ఈ బహిరంగ సభలో నేను నా ముఖ్య అనుచరులు కాంగ్రెస్ తీర్థం తీసుకుంటా. గడిచిన 45 రోజులు అహర్నిశలు కష్టపడి కార్యకర్తలను సభకు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా ఆర్టీసీ బస్సులను అడిగితే ఇవ్వలేదు. రాహూల్ గాంధీ వస్తున్నందుకు ఆయనకు మద్దతు తెలిపేందుకు లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు. సభా ప్రాంగణ చుట్టూ పక్కల చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు.
గోదావరిజిల్లాలో జనసేనవైపే సినీ గ్లామర్..
సభకు వెళ్లకుండా ప్రజలను అడ్డుకునేందుకే ఆ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. మీరు సభలు పెట్టుకోవచ్చు మేము పెట్టుకోకూడదా అని ప్రశ్నించారు. ఖమ్మం లో మరి దుర్మార్గం నేడు ఉదయం నుండి రేపు సాయంత్రం వరకు మంచి నీరు నిలిపివేశారు. ఇంత అన్యాయం ఎక్కడా లేదు. నేడు ఉదయం ఖమ్మం పట్టణంలో అన్ని చోట్ల పోస్టర్లు అంటించారు. మువ్వా విజయ్ బాబు నిన్ను చంపి శవాన్ని కూడా దొరక కుండా చేస్తాం అని పోస్టర్లు ఏర్పాటు చేశారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. మీరు వాహనాలు ఆపినంత మాత్రాన సభకు రాకుండా ప్రజలు ఎవ్వరూ ఉండరు. ఇంత నీచాతి నీచంగా ఉంటుందా మీ పాలన.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు వచ్చిన ధైర్యంగా ఉండండి. మీకు నేను ఉన్నాను నాకు మీటింగ్ ముఖ్యం కాదు. కార్యకర్తలకు ఎదైనా జరిగితే సభ కూడా జరగదని అన్నారు. నేను ఆ ఘటన స్థలానికి చేరుకుంటా. కొందరు అధికారులు చెంచా గిరి విధానాలు మార్చుకోవాలని అన్నారు. మీరు పింక్ డ్రెస్ వేసుకున్నారా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు ఆ విధానాలు మానుకోవాలి. లేదంటే ఆ ఫలితం అనుభవించక తప్పదు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కొంతమంది అధికారులు మనస్సాక్షి నీ దృష్టిలో పెట్టుకొని మీ విధులు నిర్వహించాలి. చంపుతారా ఎంతమందిని చంపుతారో చూద్దాం. రేపు నాకో నా కార్యకర్తలకో ఎదైనా జరగరానిది జరిగితే దానికి బాధ్యత సీఎం కెసీఆరే అని అన్నారు.