డాక్టర్ రాజకుమారిని తప్పించిన ప్రభుత్వం పనితీరుపై ఆరోపణలు, ఫిర్యాదులే కారణం కొత్త ఇన్ఛార్జ్గా డాక్టర్ వాణికి బాధ్యతలు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని కీలకమైన గాంధీ ఆసుపత్రిలో పాలనాపరంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్న డాక్టర్ రాజకుమారిని ఆ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో వైద్య విద్య అదనపు డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ వాణికి సూపరింటెండెంట్గా అదనపు బాధ్యతలను అప్పగించింది. గత కొంతకాలంగా డాక్టర్ రాజకుమారి పనితీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రి నిర్వహణ, పరిపాలన విషయాల్లో ఆమె వైఫల్యం చెందారంటూ పలువురు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, ఆమెపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ బదిలీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు…
Read More