UPI : భారత్‌లో డిజిటల్ చెల్లింపుల విప్లవం: యూపీఐ రికార్డు లావాదేవీలు

UPI Creates New Record: Crosses 2,000 Crore Transactions in August

ఆగస్టులో 2000 కోట్లు దాటిన యూపీఐ లావాదేవీలు ఒక్క నెలలోనే రూ.24.85 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు యూపీఐ మార్కెట్‌లో ఫోన్‌పేదే అగ్రస్థానం దాదాపు 49 శాతం వాటాతో దూసుకెళ్తున్న ఫోన్‌పే భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) మరోసారి అద్భుతమైన రికార్డును సృష్టించింది. గత ఆగస్టు నెలలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీలు మొదటిసారిగా 2000 కోట్ల మైలురాయిని అధిగమించాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ఈ లావాదేవీల మొత్తం విలువ సుమారు రూ. 24.85 లక్షల కోట్లుగా నమోదైంది. ఫోన్‌పే, గూగుల్ పే ఆధిపత్యం యూపీఐ మార్కెట్‌లో ప్రధాన పోటీదారులు అయిన ఫోన్‌పే, గూగుల్ పే తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ పోటీలో ఫోన్‌పే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.…

Read More

Telangana : ఆర్టీసీ బస్సులో ఫోన్ పోగొట్టుకున్న ప్రయాణికుడికి భారీగా నష్టం: రూ. 6.15 లక్షలు మాయం

Cyber Shock: Passenger's Bank Account Drained of Rs 6.15 Lakh After Losing Phone on Bus

బోయినపల్లి బస్టాప్‌లో ప్రయాణికుడి ఫోన్ చోరీ రెండు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు బదిలీ కొత్త సిమ్ వాడటంలో ఆలస్యమే కారణమన్న పోలీసులు హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో పోయిన సెల్‌ఫోన్ ఓ ప్రయాణికుడికి తీరని నష్టాన్ని కలిగించింది. కేవలం ఫోన్ మాత్రమే కాదు, అతని బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా రూ. 6.15 లక్షలు మాయం కావడంతో బాధితుడు నిస్సహాయంగా రోదిస్తున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన ఎం. ప్రసాదరావు ఈ నెల 2న ఉదయం బోయినపల్లి బస్టాప్‌లో నాందేడ్‌కు వెళ్లే బస్సు ఎక్కారు. ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే తన ఫోన్ కనిపించడం లేదని గమనించారు. వెంటనే అప్రమత్తమై బోధన్‌కు చేరుకున్న తర్వాత పాత నంబర్‌ను బ్లాక్ చేయించి, అదే నంబర్‌పై కొత్త సిమ్‌కార్డు తీసుకున్నారు.…

Read More