CM Revanth Reddy met representatives of American Apple | అమెరికా యాపిల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. | Eeroju news

CM Revanth Reddy met representatives of American Apple

అమెరికా యాపిల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. హైదరాబాద్ CM Revanth Reddy met representatives of American Apple అమెరికా కాలిఫోర్నియా లోని కుపెర్టినోలోని ఆపిల్ కార్పొరేట్ ప్రధాన కార్యాల యమైన ఆపిల్ పార్క్‌ను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ అనేక రంగాల్లో ప్రముఖ పెట్టుబ డులకు గమ్యస్థానంగా ఉందని హైదరాబాద్ మరియు తెలంగాణకు బలమైన పిచ్‌ని రూపొం దించడానికి అనువైన ప్రదేశమని అన్నారు. సీఎం. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీనియర్ అధికారులతో సహా తన అధికారుల బృందం, కొత్త ఎలక్ట్రానిక్స్ పార్క్, స్కిల్స్ యూని వర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫ్యూచర్ సిటీ, పబ్లిక్ పాలసీ మరి యు ఆపిల్‌ను చూసే అవకాశం కలిగిందన్నారు.  ఆపిల్…

Read More

CM Revanth Reddy | రేవంత్ కు అరుదైన గౌరవం… | Eeroju news

CM Revanth Reddy

రేవంత్ కు అరుదైన గౌరవం… హైదరాబాద్, ఆగస్టు 7, (న్యూస్ పల్స్) CM Revanth Reddy తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు పలు హామీలను అమలు చేసేందుకు రేవంత్‌ సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. తాజాగా రైతు రుణమాఫీ చేస్తున్నారు. ఇప్పటికే రూ.1.50 లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఇటీవలే 2024-25 సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 2న ముగిశాయి. ఈ క్రమంలో తెలంగాణలోకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు…

Read More

Frauds with zero tickets | జీరో టిక్కెట్ తో మోసాలు | Eeroju news

Frauds with zero tickets

జీరో టిక్కెట్ తో మోసాలు హైదరాబాద్, ఆగస్టు 6, (న్యూస్ పల్స్) Frauds with zero tickets తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకం విజయవంతంగా నడుస్తోంది. ఆరు నెలలుగా ఈ పథకం ఎలాంటి అంతరాయం లేకుండా అటు ప్రభుత్వానికి కూడా ఆదాయం పెంచుతూ ఊరటనిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో బస్సులలో మామూలు కన్నా ఆక్యుపెన్సీ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఆర్టీసీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచుకుంటోంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడలేదని అంటున్నారు. మొదట్లో ఈ పథకం అమలు చేయడంలో ఉన్న లోటుపాట్లను సరిచేయడానికి ఆర్టీసీ అధికారులు జీరో టిక్కెట్లు కూడా జారీ చేస్తున్నారు. ఉచిత ప్రయాణం చేసే ప్రతి మహిళకూ జీరో టిక్కెట్లను కొట్టడం ద్వారా ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించే…

Read More

A big industrialist as the chairman of Telangana Skill University | తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీ చైర్మన్‌గా బడా పారిశ్రామిక వేత్త | Eeroju news

A big industrialist as the chairman of Telangana Skill University

తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీ చైర్మన్‌గా బడా పారిశ్రామిక వేత్త హైదరాబాద్, ఆగస్టు 6 (న్యూస్ పల్స్) A big industrialist as the chairman of Telangana Skill University అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కీలక ప్రకటన చేశారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌ను ప్రకటించారు. బిలియనీర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ స్కిల్ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారని వెల్లడించారు. మరో రెండు రోజుల్లోనే ఆయన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నదని వివరించారు. ఇటీవలే దీనిని సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. ఆగస్టు 1న రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ఈ యూనివర్సిటిని ఏర్పాటు చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ…

Read More

New Ration Cards…. | కొత్త రేషన్ కార్డులు…. | Eeroju news

కొత్త రేషన్ కార్డులు....

కొత్త రేషన్ కార్డులు…. హైదరాబాద్, ఆగస్టు 3, (న్యూస్ పల్స్) New Ration Cards…. తెలంగాణ అసెంఈ్ల ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అర్హులకు రేషన్‌ కార్డులు జారీ చేస్తామని నాటి పీసీసీ చీఫ్‌.. నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చారు. పదేళ్లలో రేషన్‌ కార్డులు జారీ చేయకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆరు గ్యారంటీలతోపాటు అనేక హామీలు ఇవ్వడం, బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలని డిసైడ్‌ అయ్యారు. కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌న గద్దె దించి.. కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడునెలలైనా కొత్త రేషన్‌కార్డుల జారీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో…

Read More

Revanth Tour aims for huge investments | భారీ పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ టూర్ | Eeroju news

Revanth Tour aims for huge investments

భారీ పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ టూర్ హైదరాబాద్, ఆగస్టు 3 (న్యూస్ పల్స్) Revanth Tour aims for huge investments తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. 10 రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెరికాతో పాటు, ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందులో భాగంగానే శ‌నివారం ఉద‌యం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ముఖ్య‌మంత్రితో పాటు, మంత్రి శ్రీధ‌ర్ భాబు.. అధికార‌లు బృందం అమెరికాకు బ‌య‌లు దేరి వెళ్లారు. రాష్ట్రానికి భారీ పెట్టుబ‌డే ల‌క్ష్యంగా సీఎం విదేశీ ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని ఇది వ‌ర‌కే అధికారులు ప్ర‌క‌టించారు. మొద‌ట హైద‌రాబాద్ నుంచి న్యూయార్క్ చేరుకుంటారు. అక్క‌డ ఆరోజు రోజుల అనంత‌రం అక్క‌డి నుంచి నేరుగా ద‌క్షిణ కొరియా వెళ్తారు. అనంత‌రం అక్క‌డ ప‌ర్య‌ట‌న ముగించుకొని తిరిగి సీఎం బృందం ఈ నెల 14వ తేదీన ఉద‌యం…

Read More

Target Revanth… | టార్గెట్ రేవంత్… మారుతున్న సమీకరణాలు | Eeroju news

Target Revanth...

టార్గెట్ రేవంత్… మారుతున్న సమీకరణాలు హైదరాబాద్, ఆగస్టు 2 (న్యూస్ పల్స్) Target Revanth… తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు చేరికలతో జోష్ మీద ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇక కెసిఆర్ పార్టీ నిర్వీర్యమే అన్నంత రేంజ్ లో రాజకీయం నడిచింది. కోలుకోలేని దెబ్బ తగిలిందని..కెసిఆర్ కోలుకోవడం కష్టమని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో తిరిగి చేరికలు పెరగడం అధికార పార్టీని కలవరపరుస్తోంది. తెర వెనుక ఏం జరుగుతుందో తెలియక అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సతమతమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కంటే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని సరికొత్త రాజకీయ క్రీడకు తెర తీసినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది కూడా కాలేదు. అప్పుడే బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులకు గేట్లు…

Read More

Akbaruddin Owaisi suspended the speaker in the assembly | అసెంబ్లీలో స్పీకర్ ను నిలదీసిన అక్బరుద్దీన్ ఓవైసీ | Eeroju news

అసెంబ్లీలో స్పీకర్ ను నిలదీసిన అక్బరుద్దీన్ ఓవైసీ

అసెంబ్లీలో స్పీకర్ ను నిలదీసిన అక్బరుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఆగష్టు 1 Akbaruddin Owaisi suspended the speaker in the assembly శాసన సభను క్రమశిక్షణలో పెట్టడమో, లేదంటే సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడమో, లేదంటే క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న వారిని సస్పెండ్ చేయడమో ఏదో ఒకటి చేయాలని ఎంఎంఐ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సభాధ్యక్షుడు గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు.  ఇంతకీ ఏం జరిగిందంటే.. బిఆర్ఎస్ ఎంఎల్ఏ సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని సిఎం రేవంత్‌రెడ్డి అవమానించారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ సభ్యులు ఈ రోజు సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. సభలో సబితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతూ నిరసన తెలిపారు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకే ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ అంశంపై చర్చించాలని సిఎం రేవంత్…

Read More

Arrest of BRS MLAs Speaker is serious about dharna videos | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ | Eeroju news

BRS

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ – ధర్నా వీడియోలపై స్పీకర్ సీరియస్     హైదరాబాద్, ఆగస్టు 1 Arrest of BRS MLAs Speaker is serious about dharna videos తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ చాంబర్ ముందు ధర్నా చేస్తున్న  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు తీసుకు వచ్చారు. వారిని తర్వాత పోలీసులు అరెస్టు చేసి బస్సులో స్టేషన్‌కు తరలించారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం సరి కాదని.. స్పీకర్ చాంబర్ ముందు నుంచి అందరూ వెళ్లిపోవాలని చెప్పినా కదలకపోవడంతో.. మార్షల్స్ వారిని ఎత్తుకుని తీసుకెళ్లారు. అక్కడ వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తలించారు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా వ్యవహారం వివాాస్పదమయింది. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి…

Read More

Revanth Reddy, Batti Vikramarka effigy burning | రేవంత్ రెడ్డి,బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనం | Eeroju news

Revanth Reddy, Batti Vikramarka effigy burning

రేవంత్ రెడ్డి,బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనం రంగారెడ్డి Revanth Reddy, Batti Vikramarka effigy burning సబితా ఇంద్రారెడ్డి కి సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. బడంగ్ పేట్ చౌరస్తా లో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా అని చూడకుండా అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ని అవమానపరిచే విధంగా మాట్లాడడని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.  బడంగ్ పేట్ చౌరస్తాలో ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మహిళలు అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేకుండా పోయిందని రామిడి రామిరెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నందుకే టార్గెట్ చేశారని రామ్ రెడ్డి అన్నారు. సబితా ఇంద్రారెడ్డి…

Read More