Vijayawada:లోకేశ్ కు డిప్యూటీ సీఎం డిమాండ్ నష్టనివారణ చర్యల్లో టీడీపీ అధిష్టానం

The party leadership has issued key directives on the demands coming from the TDP leaders to give Deputy CM status to Minister Nara Lokesh.

మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని టీడీపీ నేతల నుంచి వస్తోన్న డిమాండ్లపై పార్టీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆదేశించింది లోకేశ్ కు డిప్యూటీ సీఎం డిమాండ్ నష్టనివారణ చర్యల్లో టీడీపీ అధిష్టానం విజయవాడ, జనవరి 21 మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని టీడీపీ నేతల నుంచి వస్తోన్న డిమాండ్లపై పార్టీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఈ అంశంపై ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయొద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని ప్రకటించింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని ప్రకటనలో పేర్కొంది.సీఎం చంద్రబాబు వైఎస్ఆర్…

Read More

Vijayawada:వారసుల సక్సెస్ రేటు ఎంత

ap political news

రాజకీయ పార్టీలు వారసులకు పగ్గాలు అప్పగించడం పరిపాటి. ప్రధానంగా ప్రాంతీయ పార్టీల్లో వారసులదే పార్టీలో ఆధిపత్యం.తండ్రులు, తాతలు స్థాపించిన పార్టీలను వీరు సక్రమంగా జనంలోకి తీసుకెళ్లి సక్సెస్ అవుతున్నారా? లేదా? అంటే సక్సెస్ రేటు మాత్రం తక్కువగానే ఉందని చెప్పాలి. వారసుల సక్సెస్ రేటు ఎంత.. విజయవాడ, జనవరి 21 రాజకీయ పార్టీలు వారసులకు పగ్గాలు అప్పగించడం పరిపాటి. ప్రధానంగా ప్రాంతీయ పార్టీల్లో వారసులదే పార్టీలో ఆధిపత్యం.తండ్రులు, తాతలు స్థాపించిన పార్టీలను వీరు సక్రమంగా జనంలోకి తీసుకెళ్లి సక్సెస్ అవుతున్నారా? లేదా? అంటే సక్సెస్ రేటు మాత్రం తక్కువగానే ఉందని చెప్పాలి. దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రాంతీయ పార్టీలను నెలకొల్పి తమ రాష్ట్రాల్లో అధికారాల్లోకి తెచ్చారు. కానీ వారసుల టైం వచ్చేసరికి మాత్రం పార్టీ వ్యవహారం మాత్రం తలకిందులవుతుంది. ఎక్కువ శాతం ఓటములు వారి ఖాతాల్లో…

Read More

Vijayawada:పొలిట్ బ్యూరో లోకి రామ్మోహన్ నాయుడు

Leader Errannaidu Polituro

పొలిట్‌ బ్యూరోలో పని చేసే అదృష్టం కింజరాపు కుటుంబానికి మరోసారి వరించనుంది. అప్పట్లో దివంగత నేత ఎర్రన్నాయుడు పొలిట్యూరో సభ్యుడిగా పని చేశారు. ఇప్పుడు రామ్మోహన్నాయుడికి ఈ అవకాశం దగ్గనుంది. పొలిట్ బ్యూరో లోకి రామ్మోహన్ నాయుడు.. విజయవాడ, జనవరి 20 పొలిట్‌ బ్యూరోలో పని చేసే అదృష్టం కింజరాపు కుటుంబానికి మరోసారి వరించనుంది. అప్పట్లో దివంగత నేత ఎర్రన్నాయుడు పొలిట్యూరో సభ్యుడిగా పని చేశారు. ఇప్పుడు రామ్మోహన్నాయుడికి ఈ అవకాశం దగ్గనుంది. ఈ విషయంలో టీడీపీ యువనేత లోకేష్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. వాస్తవానికి టీడీపీ పొలిట్‌ బ్యూరో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. పాత తరానికి విశ్రాంతినిచ్చి, కేవలం వారియర్స్‌ను మాత్రమే తీసుకోవాలని యువనేత భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా తన సొంత టీంను సిద్ధం చేసుకుంటున్నారు. భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా…

Read More

Vijayawada:పవన్ చుట్టూ ఏం జరుగుతోంది

Drone movement near AP Deputy CM Pawan Kalyan's camp office created a commotion

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర డ్రోన్ సంచారం కలకలం రేపింది. క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. మధ్యాహ్నం సమయంలో డ్రోన్ ఎగిరినట్లు గుర్తించారు. పవన్ చుట్టూ ఏం జరుగుతోంది.. విజయవాడ, జనవరి 20 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర డ్రోన్ సంచారం కలకలం రేపింది. క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. మధ్యాహ్నం సమయంలో డ్రోన్ ఎగిరినట్లు గుర్తించారు. అప్రమత్తమైన క్యాంప్ ఆఫీస్ సిబ్బంది.. భద్రతా కారణాల దృష్ట్యా డీజీపీ కార్యాలయానికి సమాచారం అందించారు. గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారుమంగళగిరిలోని జనసేనాని పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ పైన, పార్టీ కార్యాలయంగా నిర్మాణంలో ఉన్న భవనంపైన కూడా ఒక గుర్తు తెలియని డ్రోన్ ఎగిరినట్లు కార్యాలయ…

Read More

Vijayawada:డీజీపీ రేసులో హరీష్ గుప్తా

Harish Gupta in DGP race

ఏపీలో కొత్త డీజీపీ ఎంపికపై మళ్లీ చర్చ మొదలైంది. జనవరి నెలాఖర్లో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. డీజీపీ రేసులో హరీష్ గుప్తా విజయవాడ, జనవరి 18 ఏపీలో కొత్త డీజీపీ ఎంపికపై మళ్లీ చర్చ మొదలైంది. జనవరి నెలాఖర్లో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ప్రస్తుత డీజీపీని కొనసాగించడంపై యూపీఎస్సీకి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన పంపకపోవడంతో కొత్త డీజీపీ ఎంపిక అనివార్యం కానుంది.మరోవైపు కొత్త డీజీపీ రేసులో మాజీ డీజీపీ హరీష్‌ కుమార్ గుప్తా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం హరీష్‌ కుమార్‌ గుప్తాను…

Read More

Vijayawada:నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ప్రచారం

Nara Lokesh is campaigning for the post of Deputy CM

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం పొత్తులు పెట్టుకుంటాయి. పైస్థాయి నాయకులు చర్చలతో చాలా ఈజీగా కలిసిపోతారు. కానీ.. గ్రౌండ్ లెవల్ క్యాడర్ అంతా ఈజీగా కలిసిపోరు. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ప్రచారం విజయవాడ, జనవరి 18 రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం పొత్తులు పెట్టుకుంటాయి. పైస్థాయి నాయకులు చర్చలతో చాలా ఈజీగా కలిసిపోతారు. కానీ.. గ్రౌండ్ లెవల్ క్యాడర్ అంతా ఈజీగా కలిసిపోరు. కానీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ఓట్లు చీలకుండా కూటమికి పడ్డాయి. అక్కడి దాకా బాగానే ఉన్నా.. తాజాగా నేతలను పోల్చి చూసే పరిస్థితి ఏర్పడింది.చంద్రబాబు రాజకీయ, పాలన అనుభవం ఉన్న నాయకుడు. ఆయనను ఇటు జనసేన, అటు బీజేపీ క్యాడర్, నాయకులు గౌరవిస్తున్నారు. చంద్రబాబుతో ఇష్యూ ఏం…

Read More

Whatsapp:వాట్సప్ లో సివిక్ సర్వీసెస్ ఈ గవర్నెన్స్ లో నయా టెక్నాలజీ

Civic Services on WhatsApp is a new technology in governance

ఆంధ్రప్రదేశ్‌లో వాట్సప్‌లో పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఈ గవర్నెన్స్‌లో మెటా సేవల్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. అందరికి పౌర సేవల్ని వాట్సప్‌ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాట్సప్ లో సివిక్ సర్వీసెస్ ఈ గవర్నెన్స్ లో నయా టెక్నాలజీ విజయవాడ, జనవరి 18 ఆంధ్రప్రదేశ్‌లో వాట్సప్‌లో పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఈ గవర్నెన్స్‌లో మెటా సేవల్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. అందరికి పౌర సేవల్ని వాట్సప్‌ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో శనివారంనుంచి రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది. మొబైల్‌ ఫోన్‌లోనే ప్రజలకు 150 రకాల పౌర సేవల్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఏపీలో పౌర సేవలు, ప్రభుత్వ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ…

Read More

Vijayawada:సంక్రాంతి బరిలో 3 వేల కోట్ల పందేలు

3,000 crores race in Sankranti Bari

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఓవైపు పిండి వంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, పూజలు, భోగి మంటలు జరుపుకున్నారు. మరోవైపు కోడి పందాలు, గుండాటలతోపాటు అనేక క్రీడా పోటీలు కొనసాగాయి. సంక్రాంతి బరిలో 3 వేల కోట్ల పందేలు విజయవాడ, జనవరి 17 తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఓవైపు పిండి వంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, పూజలు, భోగి మంటలు జరుపుకున్నారు. మరోవైపు కోడి పందాలు, గుండాటలతోపాటు అనేక క్రీడా పోటీలు కొనసాగాయి. కోడి పందాలు జరిగిన ప్రాంతాలు మినీ స్టేడియం నే తలపించాయి. ఎటు చూసినా టెంట్లు, కుర్చీలు, ఎల్ఈడి స్క్రీన్లు, గ్యాలరీలు, కామెంట్రీ లు… ఇలా ఒకటేమిటి అన్ని చిత్ర విచిత్రాలు కొనసాగాయి.ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో కోడి పందాలు కొనసాగాయి. భారీగా బరులు ఏర్పాటు చేశారు.…

Read More

Vijayawada:ఏపీలో క్రీడా రాజకీయాలు

Sports politics in AP

రాజకీయ పార్టీల ఆధిపత్యం తప్ప ఏపీలో క్రీడల ప్రోత్సాహానికి సహకారం మాత్రం కొరవడింది.కొన్నేళ్లుగా క్రీడా సంఘాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం క్రీడల పాలిట శాపంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీల ప్రాపకం కోసం క్రీడా సంఘాలు వెంపర్లాడటంతో అసలు లక్ష్యం మరుగు పడిపోయింది. ఏపీలో క్రీడా రాజకీయాలు.. విజయవాడ, జనవరి 17 రాజకీయ పార్టీల ఆధిపత్యం తప్ప ఏపీలో క్రీడల ప్రోత్సాహానికి సహకారం మాత్రం కొరవడింది. కొన్నేళ్లుగా క్రీడా సంఘాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం క్రీడల పాలిట శాపంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీల ప్రాపకం కోసం క్రీడా సంఘాలు వెంపర్లాడటంతో అసలు లక్ష్యం మరుగు పడిపోయింది. క్రీడా సంఘాల్ని నిర్వీర్యం చేసి వాటిని ఫక్తు రాజకీయ సంఘాలుగా మార్చేయడంలో అన్ని పార్టీలకు వాటా ఉంది. క్రీడా సంఘాలతో వచ్చే గుర్తింపు, ఈవెంట్ల నిర్వహణలో వచ్చే ఆదాయం…

Read More

RTC:సంక్రాంతికి ఆర్టీసీ ఆదాయం 12 కోట్లు

12 crores of RTC revenue for Sankranti

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ – ఏపీఎస్ఆర్టీసీ 7,200 ప్రత్యేక బస్సులు నడిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. సంక్రాంతికి ఆర్టీసీ ఆదాయం 12 కోట్లు విజయవాడ, జనవరి 17 సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ – ఏపీఎస్ఆర్టీసీ 7,200 ప్రత్యేక బస్సులు నడిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులో దాదాపుగా 4లక్షల మంది ప్రయాణించినట్టు తెలిపింది. కనుమతో సంక్రాంతి పండుగ సంబురాలు పూర్తయినప్పటికీ.. చాలా మంది ఇంకా తిరుగు ప్రయాణం చేయలేదు. అందులోనూ వీకెండ్ దగ్గరగా ఉండడంతో సెలవుల్లో కుటుంబంతో గడుపుతున్నారు. ఇక తిరుగుప్రయాణాలు ప్రారంభం కాకపోవడంతో ఈ ఆదాయం మరింత పెరిగే…

Read More