తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటు కార్యాలయంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పార్లమెంట్ అధ్యక్షులు బుద్ధ నాగజదీశ్వరరావు మాట్లాడుతూ మొన్న జరిగిన మహానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశారని మహాశక్తి పథకం ద్వారా 18 సంవత్సరాలు వచ్చిన ఆడబిడ్డకు 59 సంవత్సరాల వరకు నెలకు సిలిండర్లు ప్రకటించారని,బస్సులో ప్రయాణం చేసే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారని అన్నారు.
తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆడారి మంజు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయంలో మహిళలకు రక్షణ, గౌరవం చట్టసభల్లో సీట్లు, కేటాయించి మహిళలను ముందుకు నడిపారని మొదటి విడత ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంజు అన్నారు. జిల్లా తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి సుకలా రమణమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు దీపం పథకం ప్రవేశపెట్టి డ్వాక్రా సంఘాలులో ప్రతి మహిళ కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చారని, మరలా ఇప్పుడు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించి మహిళలను ఆదుకుంటున్నారని రమణమ్మ అన్నారు.
ఈ సమావేశంలో కోటా నీలవేణి చోడవరం నియోజవర్గం తెలుగు మహిళ ఇన్చార్జ్ రేబాక మాలతి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి రేబాక మాలతి రాంబిల్లి మండలం మహిళా అధ్యక్షురాలు, కొణతాల రత్నకుమారి రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కాయల ప్రసన్న లక్ష్మి జిల్లా తెలుగు మహిళా ఉపాధ్యక్షులు బీశెట్టి హేమ జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వహణ కార్యదర్శి శంకర్ల పద్మలత విశాఖ అర్బన్ తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు,వేదుల సూర్య ప్రభ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్న సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు గారు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ.. సైకిల్ రావాలి, సైకో పోవాలి అనే నినాదాలు చేసారు.