Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

చిరంజీవిని ఫాలో అవుతున్న వైఎస్ షర్మిల..

YS Sharmila following Chiranjeevi in politics

0

అన్నీ అయిపోయాయ్‌. రేపోమాపో కాంగ్రెస్‌లో కలవడమే మిగిలిందనుకున్నారు. తను కూడా ఢిల్లీ పెద్దలకు టచ్‌లో ఉన్నారు. కర్నాటక పీసీసీ చీఫ్‌ డీకేతో అన్ని అంశాలు మాట్లాడుతున్నారు. కానీ నేడోరేపో అంటున్నా ఆ ప్రక్రియ దిశగా అడుగుపడటం లేదు. ఆమె కూడా అవునని ఒప్పుకోవడం లేదు. కాదని ఖండించడం లేదు. కాంగ్రెస్‌లో చేరతారో లేదోగానీ.. మళ్లీ అమ్ములపొదిలోని అస్త్రాలైతే బయటికి తీస్తున్నారు వైఎస్‌ షర్మిల. గ్యాప్‌ రాలేదు.. నేనే తీసుకున్నానన్నట్టు మళ్లీ న్యూస్‌లోకొచ్చారు YSRTP President  Ys Sharmila వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌కి టూర్‌ ప్లాన్‌ చేసుకున్నారు. అయితే పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు షర్మిలను హౌస్‌ అరెస్ట్‌ చేయటంతో లోటస్‌పాండ్‌ దగ్గర కాసేపు టెన్షన్‌ వాతావరణం నడిచింది. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేస్తారన్న ప్రచారం తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నారు వైఎస్‌ షర్మిల. కానీ మళ్లీ ఇప్పుడు యాక్టివ్‌ కావటంతో కాంగ్రెస్‌లో ఆమె చేరిక ఉన్నట్టా లేనట్టా అన్న చర్చ మొదలైంది. పోలీసులు తనను ఇల్లు కదలనివ్వకపోవటంతో వారికి హారతి ఇచ్చి మరీ నిరసనకు దిగారు షర్మిల.తాజా పరిణామాలతో అవసరమైతే ఒంటరి పోరాటానికైనా సిద్ధమేనన్న సంకేతాలిచ్చారు వైఎస్‌ షర్మిల. తన ప్రతిపాదనలకు ఒప్పుకుంటేనే కాంగ్రెస్‌లో చేరాలన్న పట్టుదలతో ఆమె ఉన్నట్టు కనిపిస్తోంది. పాలేరు నుంచి పోటీచేస్తానని ఇప్పటికే ప్రకటించిన షర్మిల కాంగ్రెస్‌ పార్టీ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. తన మద్దతుదారులకు కూడా షర్మిల కొన్ని సీట్లు అడుగుతున్నారన్న మాట వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్‌లో షర్మిల చేరికని.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ వ్యతిరేకిస్తున్నారు.

YS Sharmila following Chiranjeevi in politics

మరోవైపు కొందరు కాంగ్రెస్‌ సీనియర్లు ఆమెకు వెల్‌కం చెబుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌లో విలీనానికి అంగీకరించినా అసెంబ్లీకి షర్మిల పోటీపై మాత్రం ససేమిరా అంటున్నారట రేవంత్‌. అక్కడే మెలికపడిందని, అవసరమైతే షర్మిలను లోక్‌సభకు పోటీ చేయించడానికి, రాజ్యసభకు పంపడానికి కూడా కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందన్నది ఇంటర్నల్‌ టాక్‌. టీ కాంగ్రెస్‌లో కొందరు సూచిస్తున్నట్లు Sharmila on AP Politics ఏపీ పాలిటిక్స్‌పై షర్మిల ఆసక్తిగా లేరు. పార్టీ కేంద్రనాయకత్వంతో మాట్లాడుతున్న డీకేతో అదే విషయం చెప్పేశారట షర్మిల. పార్టీని రద్దు చేసి కాంగ్రెస్‌లో చేరడమా, లేదంటే కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని విలీనం చేయడమా అన్న రెండు ప్రతిపాదనలు కూడా షర్మిల ముందు ఉన్నాయంటున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌.. షర్మిల చేరిక పార్టీకి ఎంతోకొంత మేలు జరుగుతుందన్న అంచనాతో ఉంది. కానీ ఆమె డిమాండ్లు, టీపీసీసీ చీఫ్‌ అభ్యంతరాలతోనే.. ఉభయతారకంగా ఉండే నిర్ణయం విషయంలో ఆలస్యమవుతోంది. ఈలోపు నా దారి నాకుందన్న సంకేతాలిచ్చేందుకే మళ్లీ షర్మిల యాక్టివ్‌ అవుతున్నారన్నది కొందరి ఒపీనియన్‌. అసలే రాజన్నబిడ్డ.. అంతీజీగా రాజీపడుతుందా? చెప్పండి.

ఐదు సెగ్మెంట్లు ఇవ్వాల్సిందే
పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సెగ్మెంట్లు ఇవ్వాలన్న డిమాండును వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్, Late CM YS Rajasekhar Reddy దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల ఆ పార్టీ హైకమాండ్ ముందుంచిందా.. అలా అయితేనే విలీన ప్రక్రియకు చేతనైనన్ని షర్మిల షరతు పెట్టిందా అంటే అవుననే అంటున్నారు. ఇరు పార్టీల నేతలు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కన్న కలలను నిజం చేయాలన్న ఉద్దేశంతో షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, ఎదుర్కొంటు న్న సమస్యలను తెలుసుకునేందుకు ఆమె సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న షర్మిల మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ షర్మిలతో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. భర్త అనిల్, పార్టీ ముఖ్యలతో సుదీర్ఘ మంతనాల అనంతరం షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు పలు దఫాలు ఢిల్లీ వెళ్లిన బ్రదర్ అనిల్ కుమార్ కాంగ్రెస్ పెద్దలతోనూ వరుస భేటీలు నిర్వహించి విలీన ప్రక్రియ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పాత్రపై చర్చినట్టు వార్తలొచ్చాయి.

షర్మిల, అనిల్ హస్తిన వెళ్లి కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సమావేశం

నాలుగు రోజుల క్రితం షర్మిల, అనిల్ హస్తిన వెళ్లి కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సమావేశమై విలీన ప్రక్రియ ముహుర్తాన్ని ఖరారు చేసుకున్నారని ప్రచారం జరిగింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లిన షర్మిల అంతకుముందు డీకే శివకుమార్ తో ప్రత్యేకంగా సమావేశమై సమాలోచనలు జరిపినట్టు సమాచారం. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న విషయాన్ని షర్మిల పార్టీ సీనియర్లతో సమావేశమై చెప్పి వారి అభిప్రాయాలను సేకరించినట్టు తెలుస్తోంది. వరుసగా రెండు రోజులపాటు ఆమె ఇక్కడి లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో నేతలను కలుస్తూ వారితో చర్చిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మరో దఫా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ లతో సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. పార్టీ విలీనం తర్వాత జరగనున్న పరిణామాలను అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఇచ్చే సీట్ల విషయంలో స్పష్టతకు రావాలని భావిస్తున్నట్టు సమాచారంమరో నాలుగైదు నెలల్లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల ఐదు అసెంబ్లీ స్థానాలను కోరే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో ఎటూ తేల్చుకోలేని నిస్సహాయ స్థితిలో తెలంగాణ కొట్టు మిట్టాడుతోంది. తాజాగా షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నట్టు సమాచారం.

ఒక వైపు డీకే శివకుమార్ పట్టుబట్టి షర్మిల పార్టీని విలీనం చేసే దిశగా చర్యలు చెపట్టారని, ఇప్పుడు ఈ విషయంలో వెనక్కు తగ్గినా ప్రక్రియను వ్యతిరేకించినా వచ్చే ఎన్నికల్లో ఆయన మద్దతు ఉండదన్న ఆందోళన పీసీసీ నేతల్లో వ్యక్తమవుతున్నట్టు సమాచారం. షర్మిల కోరుతున్నట్టు ఐదు అసెంబ్లీ స్థానాలివ్వడానికి రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధంగా లేదన్న సంకేతాలను పార్టీ ముఖ్యనేతలు డీకే శివకుమార్ కు పంపించినట్లు సమాచారం. ఖమ్మం జిల్లా పాలేరు, ఉమ్మడి వరంగల్ జిల్లా డోర్నకల్, ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి లేదా నకిరేకల్, సికింద్రాబాద్ స్థానాలను షర్మిల కోరుతున్నట్టు చెబుతున్నారు. పాలేరు నుంచి తాను పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించడంతో పాటు అక్కడ పార్టీ కార్యాలయాన్ని, నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. షర్మిల అనుచరుడు ఏపూరు సోమన్న తుంగతుర్తి నుంచి పోటీకి సిద్ధమయ్యారు. మహబూబాబాద్ అసెంబ్లీ నుంచి సుజాతను బరిలో నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఐదు సీట్లు కోరుతున్న షర్మిలకు నచ్చజెప్పి రెండు స్థానాలను ఇవ్వాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ పెద్దల్లో ఉన్నట్టు చెబుతున్నారు. అప్పటికీ ఆమె మరో సీటు కోసం పట్టుబడితే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు వినికిడి. ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్న షర్మిల అక్కడే పార్టీ పెద్దలను కలిసి అన్ని విషయాలు మాట్లాడుకోవాలని ప్రతిపాదించారని ఆమె సన్నిహిత నేతలు వివరించారు. ఏది ఏమైనా.. షర్మిలా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం మాత్రం ఖాయం.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie