అజ్ఞాతంలోకి బిగ్బాస్-7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్
సిద్దిపేట
బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. మంగళవారం సాయంత్రం నుంచి అందుబాటులో లేకుడా పోయాడు. ప్రశాంత్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన సందర్భంగా ర్యాలీలో జరిగిన గొడవలో ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మంగళవారమే పల్లవి ప్రశాంత్ స్నేహితులు ఇద్దరిపై కేసు నమోదు చేసారు. పోలీసుల వేధింపుల వల్లే తమ కుమారుడు అజ్ఞాతంలోకి వెళ్ళాడని ప్రశాంత్ తల్లిదండ్రులు అంటున్నారు.