కేసుకు పల్లవి ప్రశాంత్ కు సంబంధం లేదు
సిద్దిపేట
బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ పై నమోదైన కేసుల విషయం లో గజ్వేల్ పట్టణం లో పల్లవి ప్రశాంత్ తరపు న్యాయవాది కే.రాజేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. కే.రాజేష్ కుమార్ మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ పై నమోదైన కేసులో అతనికి సంబంధం లేదు. పల్లవి ప్రశాంత్ పై నమోదైన కేసుల వివరాలను పోలీసులు ఆన్లైన్ లో నమోదు చేయాలి. పోలిస్ అక్ట్ ఉందని ప్రశాంత్ కు తెలియదు సుమారు వంద రోజులు గా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందున బయట ప్రపంచం ప్రశాంత్ కు తెలియదు. పోలిస్ అధికారులు పల్లవి ప్రశాంత్ కేసు వివరాలను ఆన్లైన్ లో నమోదు చేస్తే మేము న్యాయ పరంగా ముందుకు వెళ్తామని అన్నారు.