మంచిర్యాల
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం లో 1 టీఎంసీ సామర్థ్యం గల రూ.80 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న పడ్తన్ పల్లి లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రొజెక్ట్ కు ఆర్ధిక, వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు భూమి పూజ, శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో భారాస జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మేల్యే బాల్క సుమన్, ఎంపి వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, చిన్నయ్య, ఎమ్మెల్సి దండే విఠల్ తదితరులు పాల్గోన్నారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రెండు పంటలు పక్కగా పండుతాయి. హాజీపుర్, లక్షెట్ట్ పేట్ నీళ్ళు కొరత ఉండదు.30 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ , వైఎస్ జిల్లా చేస్తా అని మాట తప్పను. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. కేసీఅర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, గృహ లక్ష్మి, కళ్యాణ లక్ష్మి ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. పదేళ్లలో ఎంతో అభివృద్ది. తెలంగాణ ఆచరిస్తది దేశం అనుసరిస్తది.
టిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వాకిటి శ్రీధర్
24 గంటలు ప్రజల మధ్య ఉండే ఎమ్మెల్యే దివాకర్ రావు. బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళు, గుండాలు మంచిర్యాల వస్తున్నారు. కాట క్లబ్బులు, మోసాలు చేసిన వాళ్ళు తయారు అవుతున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా బి ఆర్ ఎస్ మూడోసారి వస్తుంది. నేను హాజీపూర్ అల్లుడిని. మంచిర్యాల అభివృద్ధికి నా వంతు కూడా కృషి చేస్తా. మేనిఫెస్టో వస్తుంది. అది వస్తే ప్రతిపక్షాల దిమ్మ తిరుగుతుంది. కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, మంటలు. సీఎం కుర్చీ కోసం మతం మంటలు రేపిన పార్టీ కాంగ్రెస్. నక్సలైట్లతో చర్చలు అని వారిని మట్టు బెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తం. నడ్డా.. ఇది కేసీఅర్ గడ్డ. సొంత రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ గెలుపించుకొలేదు. ఇక్కడ వచ్చి నువు చేసేది ఏమి లేదు. మిస్టర్ బి ఎల్ సంతోష్ తెలంగాణలో వచ్చేది హంగ్ కాదు, బి ఆర్ ఎస్ హ్యాట్రిక్. బిజెపి డిపాజిట్ల కమిటీ వేసుకుంటే మంచిది. అదిలాబాద్ జిల్లాలో పదికి పది గెలుస్తామని అన్నారు.