అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి వుంటాను ఎంపీ మోపిదేవి
బాపట్ల
అధిష్టాన నిర్ణయానికి నేను, నా కార్యకర్తలు కట్టుబడి ఉంటాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తామని ఎంపి మోపిదేవి వెంకటరమణ రావు అన్నారు.అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. కొన్ని టీవీ చానల్స్ లో వస్తున్న వార్తలు వేరే నిర్ణయాలకి తావులేదు. అంత క్రమశిక్షణ లేని వ్యక్తిని కాదు. ఎమ్మెల్యే అభ్యర్థి గ్రాఫ్ సరిగ్గా లేనప్పుడు కాకుండా కొన్ని ప్రత్యేక కారణాల వలన కూడా అధిష్టానం అభ్యర్థిని మారుస్తారు. అలాంటి పరిస్థితుల్లో క్యాడర్ కొన్ని కార్యకర్తలు క్రింది స్థాయి నాయకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం సహజం అందర్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అధిష్టానం అభ్యర్థనైతే సూచిస్తుందో ఆ అభ్యర్థికి నా పూర్తి మద్దతిస్తాం. రాబోయే ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్సిపిని అధికారంలోకి రావడానికి కష్టపడి పని చేస్తానని అన్నారు.