కోరుట్ల
అభివృద్ధి ,సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమని కోరుట్ల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్ అన్నారు.. మంగళవారం పట్టణంలోని మాదాపూర్ కాలనీలో మహిళలు, వివిధ పార్టీల నాయకులు భారీ ఎత్తున బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నచ్చి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కి మద్దతుగా మైనార్టీ నాయకుడు ఎస్ కే. వాజీద్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.. వారికి అన్నం ఆనిల్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.. ఈ సందర్భంగా అన్నం అనిల్ మాట్లాడుతూ భారత దేశంలో బిజెపి,కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల కన్నా అత్యధిక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సీఎం సహాయ నిధి వంటి పథకాలు ప్రవేశపెట్టి పంపిణీ చేయడం జరిగిందని పేదల పక్షపాతి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.. దేశం ధర్మం అంటూ కొన్ని పార్టీలు యువకులు రెచ్చగొట్టి సబ్బం గడుపుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలు వారు చేసిన అభివృద్ధి పనులు చెప్పాలేకనే కుల, మత చిచ్చు రాజేసి కాలం వేళ్ళదీస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి అన్ని కులాల మతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని గౌరవిస్తున్నారని, శాంతి భద్రత లకు తెలంగాణ నంబర్ వన్ గా అని అన్నారు..నిరుద్యోగులకు యువకుల ఉద్యోగుల కల్పన చేయడంపై కేంద్రం దృష్టి సారించాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల ప్రైవేట్ ఉద్యోగాల కల్పన, ఒక లక్ష యాభై వేల పైన ప్రభుత్వ ఉద్యోగాలు ఉపాధి అవకాశం కల్పించామని అన్నారు.మంత్రి కేటీఆర్ కృషితోనే హైదరాబాదులో ఐటీలో అగ్రగామిగా నిలిచిందన్నారు. డాక్టర్ సంజయ్ సహకారంతో పట్టణంలో ఐటి కార్యాలయం ఏర్పాటు చేసుకున్నమన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గడ్డమీది పవన్, కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ, మైనార్టీ నాయకులు ఎస్.కె వాజీద్, ఎస్ కె. అజార్ కాలనీ వాసులు నాయకురాలు రేష్మ, రాజహంస, జమున, మహిళలు, తదితరులు పాల్గొన్నారు….