ఇంకా కొలిక్కిరాని కాంగ్రెస్ జాబితా
న్యూఢిల్లీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. శుక్రవారం ఉదయం గం. 11.00 సమయంలో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కే. మురళీధరన్ అధ్యక్షతన సమావేశమైంది. ఈ భేటీలో కమిటీ సభ్యులు బాబా సిద్దిఖీ, ఏఐసిసి కార్యదర్శులు సీనీ విష్ణుదాస్, మన్సూర్ అలీ ఖాన్, రోహిత్ చౌదరి, టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే,ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కి తదితరులు పాల్గోన్నారు. 70 స్థానాలకు అభ్యర్థులు ఖరారయినట్లు సమాచారం. సోమ, మంగళవారాల్లో ఏదో ఒకరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరోసారి సమావేశమై మిగతా 49 స్థానాల కసరత్తు పూర్తి చేస్తుందని పార్టీ నేతలు అంటున్ఆరు. మొత్తం కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఒకేసారి 119 స్థానాలకు జాబితాను విడుదల చేసేందుకు పార్టీ నేతలు సిద్దమవుతున్నారు.