Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఇండియా అవుట్ క్యాంపెయిన్

0

మాల్దీవులు, జనవరి 17, 

మాల్దీవుల విషయంలో మనసు మార్చుకునే ప్రసక్తే లేదని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ‘ఈజ్‌మై‌ట్రిప్’ స్పష్టం చేసింది. భారత గౌరవానికి కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పింది. మాల్దీవులకు టికెట్లు పునరుద్ధరించే పని చేయబోమని దేశానికి మద్దతుగా నిలుస్తామని మరోసారి తెలిపింది . మాల్దీవులకు టికెట్లు రద్దు చేయడంతో వెల్లువెత్తిన విమర్శలపై ఆ సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు నిషాంత్‌ పిట్టి ఎక్స్ ద్వారా స్పందిస్తూ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో సుదీర్ఘంగా చేసిన పోస్టులో ఆయన మాల్దీవులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు అనుకూలంగా నడుచుకుంటూ.. రెండు దేశాలు కలిసి ‘ఇండియా అవుట్’ క్యాంపెయిన్‌ను నెత్తికెత్తుకున్నాయని ఆరోపించారు.

ఇండియా కంటే చైనా టూరిస్టులే తమ దేశానికి ఎక్కువగా వస్తారని, వారి నుంచే ఎక్కువ సొమ్ము తమకు వస్తుందన్న భావన అందులో కనబడుతోందన్నారు.మాల్దీవులకు టికెట్లు రద్దు చేయడం ‘రిస్కీ డెసిషన్’ అయినప్పటికీ దానికే తాము కట్టుబడి ఉన్నామని నిషాంత్ తెలిపారు. 95 శాతం మంది భారతీయులు తమకు మద్దతుగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మిగతా 5 శాతం మంది మాత్రం దీనిని రాజకీయంగా చూస్తున్నట్టు చెప్పారు. గతవారం తమ యాప్ డౌన్‌లోడ్స్ 280 శాతం పెరిగినట్టు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie