న్యూఢిల్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆమె కస్టడీ నేటితో ముగిసింది. దీంతో కవితను కోర్టులో హాజరుపర్చగా కస్టడీని మరో వారం రోజులు పెంచుతూ కోర్టు తీర్పిచ్చింది. కవిత ఈనెల 14 వరకు తిహార్ జైల్లోనే ఉండనున్నారు.