కోరుట్ల, ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉపాధి హామీ కూలీలందరూ వారి కుటుంబ సభ్యులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి కి అత్యధికంగా ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరారు.. మంగళవారం కోరుట్ల నియోజకవర్గంలోని జోగినపల్లి ,మోహన్ రావు పేట, గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.. జువ్వాడి కృష్ణారావు వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లేటి మహిపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ ఓబీసీసెల్ జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటేశం గౌడ్ ,ఎంపీటీసీ సభ్యుడు కారుకూరి నరసయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆసిరెడ్డి రాజేశం, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులు బిట్కు సహదేవ్, కిషన్ రావు, బల్వంత్ రెడ్డి, నారాయణరెడ్డి, హరీష్, గంగాధర్ ,సరికల నరేష్, మల్లారెడ్డి రాజన్న, మహేష్, తదితరులు ఉన్నారు..