నల్గోండ వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి ఐదవ రోజు మంగళవారం బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ ఎనుగుల రాకేష్ రెడ్డి దాఖలు చేసారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, రెవిన్యూ అదనపు కలెక్టర్ ములుగు జిల్లా, సిహెచ్. మహేందర్ జీ కు నామినేషన్ దాఖలు చేసారు.ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతీ రాథోడ్ హజరయ్యారు.