జగిత్యాల: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు సమయంలో ఎలాంటి ఇబ్బంధులు తలెత్తకుండా కొనుగోలు చేయాల్సింది పోయి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత -సురేష్ అన్నారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండల తాటిపెల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్ పర్సన్,ఎన్నికల ఇంచార్జి రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్ లను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో నీడ ఏర్పాటు చేయాలని త్రాగునీరు మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ బస్సు యాత్ర వల్లే ప్రభుత్వం దిగొచ్చి కేసీఆర్ రైతు బంధు నిధులనే ఈ ప్రభుత్వం విడుదల చేసింది కాని..కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన రైతు భరోసా నిధులు కాదని అన్నారు…
రైతు బాంధావుడు కేసీఆర్ ఆని బిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన కాలంలో రైతుల యొక్క సాధక బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి నేరుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల నుంచి కొనుగోలు చేసిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు…
రైతులు పండించిన ధాన్యానికి బోనస్ ఇస్తానని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్త బోగస్ మాటలేనని అన్నారు
రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆని – ఇచ్చిన ఏ హామీని నేరవర్చని ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్నారు.ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు రుణమాఫీ చేస్తానన్న సిఎం రేవంత్ రెడ్డి ఐదు నెలలు గడిచినా రుణమాఫీ కాలేదని అన్నారు…
రైతులు పండించిన వడ్లను సకాలంలో కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాల ముకుందం,
రైతుబంధు సమితి మండల కన్వీనర్ నక్క రవీందర్ రెడ్డి,మాజీ సర్పంచ్లు నాడెం రత్నమాల శంకర్,నారాయణ,నాయకులు గంగారెడ్డి,గిరీష్,అంజన్న,గణేష్,అభి,రాజు తదితరులు ఉన్నారు…
Next Post