కూటమి తోనే రాష్ట్ర అభివృద్ధిని ప్రజలంతా విశ్వసిస్తున్నారు…
-జనసేన నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
తాడేపల్లి గూడెం: తాడేపల్లిగూడెం ఉదయం కూటమి సిద్ధాంతాల వల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల విశ్వసిస్తున్నారని తాడేపల్లిగూడెం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం లోని బొలిశెట్టి నివాసం వద్ద నల్లజర్ల మండలం సింగరాజుపాలెం కు చెందిన వైఎస్సార్ పార్టీ నాయకులు అచ్యుత సత్యనారాయణ దొండపాటి బాబు గారపాటి వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో వారి మిట్ట బృందం ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి సమక్షంలో శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని దోచుకున్న వైయస్సార్ పార్టీ సిద్ధాంతాలకు విసిగిన పార్టీ నాయకులు కూటమిలో విశ్వసనీయత ఉందని గుర్తించారన్నారు. పవన్ కళ్యాణ్ త్యాగం గుర్తించి నిస్వార్ధంగా ప్రజాసేవ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి ఆకర్షితులవుతున్నారు అన్నారు.