నంద్యాల: నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్. బైరెడ్డి శబరికి వస్తున్న ఓటర్ల ఆధరణ చూసి జీర్నించుకోలేని వైసీపీ *ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి కొందరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారటిల పేరుతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, శబరిల పై ఆ వాస్తవ ప్రచారం ఛిగ్గుచేటని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారటి యువజన, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకిరి రామచంద్రుడు, మాదిగ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెనర్జీ మాదిగ, టీడీపీ క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రసాద్, ముస్లిం మైనారటి నాయకులు షేక్షా, బిసి సంఘ నాయకులు శ్రీనివాస యాదవ్ లు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారటి హక్కుల కోసం, వారికీ అండగా బైరెడ్డి శబరి కుటుంబం నిలుస్తోందని, ఏనాడు దళిత, బహుజన, మైనారటి హక్కుల కోసం గాని, వారికీ అండగా నిలువని, కనీసం పార్లమెంట్ పరిధిలో ప్రజలు చూడని, ఎం.పీ గా గుర్తు పట్టలేని వైసీపీ ఎం. అభ్యర్థికి అనుకూలంగా, నిత్యం ప్రజాసేవ చేసే టీడీపీ ఎం.పీ అభ్యర్థి బైరెడ్డి శబరిపై కొందరు వైసీపీ ఎం.పీ. పోచా అనుకూలంగా నిందలు వేయడం వారి అజ్ఞానానికి నిదర్శనం అన్నారు.