మైలవరం మార్కెట్ యార్డ్ లో ఎంపీ నిధులతో కేటాయించిన మంచినీటి ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గోన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కేశినేని నాని రాకతో పార్టీ మరింత బలోపేతం కానుంది. పార్టీలోకి ఆయన రాకను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఎయిటీ పర్సెంట్ ఖాళీ అవుతుందో, ఏం జరుగుతుందో రేపు బాక్స్ లు తెరిచాక తెలుస్తుంది. మీడియా పబ్లిసిటీ కోసం ఎవరో ఏదో మాట్లడతారు. ఉత్తరకుమార ప్రగల్భాలు ఆపితే మంచిదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా 2024లో అధికారంలోకి రాలేరని విజయవాడ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడుతూ కొడుకును ముఖ్యమంత్రిగా చేసేందుకే చంద్రబాబు కష్టపడుతున్నారని పేదల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని నాని వ్యాఖ్యానించారు.