శ్రీవారి ఆలయ ప్రాంగణములో యాత్రికుల రద్దీ స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో వెళ్తున్న భక్తులు..
ద్వారకాతిరుమల
శ్రీనివాసా గోవిందా.. వేంకటరమణా గోవిందా అంటూ స్వామి వారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తివిశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీవారి పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శనివారం భక్తుల రాకతో కళకళలాడింది. స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి దాదాపు 10వేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించినట్లు ఆలయవర్గాలు భావిస్తున్నాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికలు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
అట్టహాసంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు..
శ్రీవారి సాధారణ దర్శనానికి 2 గంటల పైబడి సమయం పట్టింది. అలాగే శ్రీవారి నిత్యార్థిత కల్యాణంలో దాదాపు 60 జంటలు పాల్గొని స్వామి వారి కల్యాణమహోత్సవాన్ని కనులారా తిలకించారు భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి