Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తెలంగాణలో మహిళా ఓటర్లే కీలకం

0

హైదరాబాద్, సెప్టెంబర్ 22, (న్యూస్ పల్స్)

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్‌ అధినియం బిల్లు-2023’ లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఊభయ సభల ఆమోదం అనంతరం రాష్ట్రపతి ముద్రతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన పూర్తైన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.ఇదిలా ఉండగా.. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని మహిళలే నిర్ణయించుతోన్నట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అంశం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా నియోజవర్గాల్లో పురష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో వీరిదే ఆధిక్యం. మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ.. కేంద్రం బిల్లు తీసుకురావటంతో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది.మహిళా రిజర్వేషన్‌ బిల్లును తమ ఖాతాలా వేసుకునేందుకు జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయి. తమ వల్లే బిల్లు వచ్చిందంటే.. లేదు తామే బిల్లును తీసుకొచ్చామని క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నాయి. ఇక తెలంగాణలో ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది.

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.13 కోట్లు కాగా.. వీరిలో 1.57 కోట్లకు పైగా పురుష ఓటర్లు ఉన్నారు. 1.56 కోట్లకుపైగా మహిళలు ఉన్నారు. స్త్రీ, పురుష ఓటర్ల మధ్య వ్యత్యాసం కేవలం లక్ష మాత్రమే. దీంతో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గత కొంత కాలంగా పోరాడుతున్నారు. ఈ విషయమై ఇటీవల ఆమె ఢిల్లీలో ధర్నా కూడా నిర్వహించారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని కోరుతూ 47 రాజకీయ పార్టీలకు లేఖలు కూడా పంపారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సైతం ప్రధాని మోదీకి లేఖ రాశారు. కవిత పోరాటం వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తమ వల్లే బిల్లు చట్టరూపం దాలుస్తోందని అంటున్నారు.

ఆ క్రెడిట్ మెుత్తం తమకే దక్కుతుందని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఆ బిల్లుకు తమ వల్లే సాధ్యమైందని చెప్పుకుంటున్నాయి. ఇలా తెలంగాణ ఎన్నికల ముందు ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుండటంతో అన్ని పార్టీలు తమ ఎన్నికల ప్రధాన అస్త్రంగా ఎంచుకొని మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.కాగా..దేశవ్యాప్తంగా జనగణన, నియోజవర్గాల పునర్విభజన తర్వాత ఈ బిల్లు అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా వెల్లడించారు. అంటే 2029 ఎన్నికల్లో మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్థానాలను (119) బట్టి దాదాపు వారికి 40 సీట్లు దక్కుతాయి. ఇక 17 లోక్‌సభ స్థానాలకు గాను 5 నుంచి 6 స్థానాలు రిజర్వ్ కానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie