నంద్యాల
నంద్యాలలో నారా భువనేశ్వరి పర్యటన కొనసాగింది. నంద్యాలలోని 13,34 వ వార్డులో చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందిన వారిని నారా భువనేశ్వరి పరామర్శించారు. నారా భువనేశ్వరి మాట్లాడుతూ..టిడిపి పార్టీని ప్రారంభించింది ఎన్టీఆర్ అని,పార్టీని ముందుకు నడిపించింది నారా చంద్రబాబు నాయుడని అన్నారు.ఎన్టీఆర్ టిడిపి పార్టీ పెట్టి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమించారు. అన్న క్యాంటీన్లో ఒక ఏడాదిలోనే 7.5 కోట్ల మంది భోజనం చేశారన్నారు.పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను వైసిపి ప్రభుత్వం మూసివేసి,పేద వాళ్ళ కడుపు కొట్టారని మండిపడ్డారు.వైసిపి ప్రభుత్వం వచ్చాక ఏపీకి ఒక్క పెట్టుబడి కూడా రాలేదు. కానీ,ఏపీ నుండి కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్లిపోయాయి.వైసిపి రాక్షస పాలనలో ఏపీని గంజాయి,డ్రగ్స్ కు కేంద్రంగా మార్చారని అన్నారు.రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని వైసిపి ఏరులై పారిస్తుంది, కల్తిమద్యం తాగిన వారు అనారోగ్యానికి గురై చనిపోతున్నారు.రానున్న ఎన్నికలలో టిడిపి,జనసేన,బిజెపి కూటమి అభ్యర్థులని గెలిపించాలని కోరారు.