మెట్ పల్లి: నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షాకీర్ ఆధ్వర్యంలో పలువార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.. మంగళవారం పట్టణంలోని ఐపివార్డు, కోర్టు ప్రాంతం, అయ్యప్ప టెంపుల్ ప్రాంతంతో పాటు రబ్బానీపుర, ప్రాంతంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ టీ. జీవన్ రెడ్డికి పలు వాడల ప్రజలు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సుస్థిరంగా ప్రభుత్వ పాలన చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన మనోగతాన్ని వ్యక్తం చేశారు. వార్డులు, నియోజకవర్గాలు బాగుండాలంటే అసలైన నాయకున్ని ఎన్నుకుంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. టి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తులసీరామ్, శమ, విజయ, నరసమ్మ , కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.