జిల్లా ఓబీసీ చైర్మన్ ఎం కాశీం వలి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలో బుధవారం రోజున మాజీ ప్రధానమంత్రి వర్యులు పీవీ నరసింహారావు గారి జయంతి వేడుకల సందర్భంగా ఒకేషనల్ కళాశాలలో పూలమాల వేసి నివాళులర్పించి, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది, కేంద్రం పివికి భారతరత్న ఇవ్వాలని తెలుగుజాతి ముద్దుబిడ్డ బహుభాషా గోవిందుడు పీవీ నరసింహారావు గారు అని తెలియజేశారు.
పీవీ నరసింహారావు గారి ప్రధానమంత్రి హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనదన్ని తెలిపారు. అనేక సంఘసంస్కరణ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. అనేక పథకాలను జాతీయకరణ చేసిన ఘనత ఈయనదే . పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. తెలుగు రాష్ట్ర అభివృద్ధి కొరకు అనేక పథకాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు వై జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్, అజయ్ విద్యార్థులు పాల్గొన్నారు