పుడమి తల్లికి తూట్లు అడుగంటుతున్న భూగర్భ జలాలు – అక్రమంగా రాత్రిపూట బోర్ల తవ్వకాలు
ములుగు
ములుగు జిల్లా ఏటూర్ నాగారం ఏజెన్సీ ప్రాంతమైన ఆకుల వారి ఘనపురం గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు రిజిస్ట్రేషన్ లేకుండానే ఏలాంటి నిబంధనలు పాటించకుండా నిబంధనలు తుంగలో తొక్కి భూగర్భ జలాలు అడుగంటుతున్న. ప్రకృతి వనరులు. పర్యావరణం దెబ్బతింటున్న. అధికారులకు పెద్ద మొత్తంలో మూడుపులు ముట్ట చెప్పి. వారి అండదండలతో నిబంధనలను గాలికి వదిలేసి రాత్రి సమయంలో అక్రమంగా దొంగ చాటున పుడమి తల్లికి తూట్లు పొడుస్తూ.మోటార్ బోర్లు భారీ యంత్రాలతో గంటల వ్యవధిలోనే వాణిజ్య అవసరాలకు. బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు ముందస్తుగా అక్రమంగా బోర్ల తవ్వకాలు చేపడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు.ఏజెన్సీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ భూభాగంలో ప్రభుత్వ భూములు. అసైన్డ్ భూములు. ఐటీడీఏ పీవో కోర్టులో ఉన్న ఎల్ టి ఆర్ భూములలో చట్టాలను తుంగంలో తొక్కి.సంపాదన ధ్వయంగా బోర్ సెట్టు. భూమాఫియా. వారితో కుమ్మక్కైన అధికారులు కాసులకు కక్కుర్తి పడి.ఇలాంటి అనుమతులు ఇవ్వకుండా నిబంధనలు పాటించకుండా.వారి ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. భూగర్భ జల సంరక్షణ చర్యలు తీసుకోవడంలో శూన్యం.భూగర్భ జల వనరుల దాటిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ. ఎలాంటి నిబంధనలు పాటించడంలేదు.
ఇంటి నిర్మాణం చేపట్టడంకు ముందు స్థానిక గ్రామపంచాయతీ అనుమతులురిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ.ఎలాంటి అనుమతులు రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే.విద్యుత్ శాఖ అధికారుల అనుమతి లేకుండానే. అక్రమంగా పనులు చేయించుకోవడం కోసం ముడుపులు ముట్టజెప్పి నిబంధనలను పాతర వేసి ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ రెవిన్యూ అసైన్డ్ భూములు ఐటీడీఏ పీవో కోర్టులో పెండింగ్లో ఉండగానే గుట్టు చప్పుడు కాకుండా దొంగచాటుగా రాత్రి సమయంలో అక్రమంగా బోర్ల తవ్వకాలు చేపడుతూ. వాణిజ్యపరంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు బోర్ల తవ్వకాలు అవసరం ఉండడంతో ముందుగా బోరు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా భూమాఫియా. బోరింగ్ సెట్ వ్యాపారులు. అధికారులతో కుమ్మక్కై లక్షలాది రూపాయలు చేతులు మారుతూ.
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ భూములు. ప్రభుత్వ రెవెన్యూ భూములనే తేడా లేకుండా. భారీ యంత్రాలతోబోరు తవ్వకాలు జరుపుతున్న విషయం.స్థానిక రెవెన్యూ అధికారులకు. సమాచారం ఉన్నప్పటికీ తమకేమీ పట్టనట్లుగా చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో అధికారుల తీరుపై ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా బోర్ల తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకొని. వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని. అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు కోరుతున్నారు