Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ప్రజల వద్దకే వైద్య సేవలు… మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ నాగభూషణం రెడ్డి

0

తుగ్గలి
వైసీపీ ప్రభుత్వంలో ప్రజల వద్దకే వైద్య సేవలు అందుతున్నాయని, “జగనన్న ఆరోగ్య సురక్ష” పథకం పేద ప్రజలకు వరం అని పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ నాగభూషణం రెడ్డి అన్నారు.శనివారం మండల పరిధిలోని రాంపల్లి గ్రామంలోనీ ప్రాథమిక పాఠశాలలొ “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమాన్ని సర్పంచ్ మునేంద్ర, నాగభూషణం రెడ్డి లు ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల వద్దకు ప్రత్యేక వైద్యులు వచ్చి,వైద్య పరీక్షలు చేసి,చికిత్స చేసేవిధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి “జగనన్న ఆరోగ్య సురక్ష”పథకం ప్రవేశపెట్టాడని వారు తెలిపారు.గ్రామీణ ప్రాంతాలకు వైద్య సదుపాయాలను తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని ఆయన తెలియజేశారు.కర్నూలు నుండి విచ్చేసిన వైద్యులు జనరల్ ఫిజీషియన్ దామోదర్ రెడ్డి, జనరల్ సర్జన్ సంతోష్,కంటి వైద్యులు వెంకటేష్ నాయక్,వైద్యాధికారులు డా.ప్రవీణ్ కుమార్, డా.మినహాజ్,డిపిఎంఓ మేరి దాసులు శిబిరానికి వచ్చిన వారికి వైద్యపరీక్షలు చేశారు. వైద్య ఆరోగ్య,104 సిబ్బంది రోగులకు మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యంపిడిఓ సావిత్రి,రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి రాజు నాయక్, మనోహర్,వీఆర్వో శ్రీనివాసులు,సిహెచ్ఓ అన్నపూర్ణ,పిహెచ్ఎన్ సరస్వతి,సూపర్వైజర్లు వెంకట రమణయ్య,నాగమ్మ,ఫార్మసిస్ట్ రమేష్, ఏమ్యెల్హెచ్పి ములేశ్వరి,హెల్త్ కార్యదర్శి రోజా, సచివాలయ సిబ్బంది,ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు,వాలంటీర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie