Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తృణ ధాన్యాల (మిల్లెట్స్) పిండిపై జీఎస్టీ 18 నుంచి ఐదు శాతానికి తగ్గింపు

0

న్యూ డిల్లీ అక్టోబర్ 7
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన జీఎస్టీ 52వ సమావేశం కీలక నిర్ణయం తీసుకున్నది. తృణ ధాన్యాల (మిల్లెట్స్) పిండిపై జీఎస్టీ 18 నుంచి ఐదు శాతానికి తగ్గించేసింది. ప్రీ-ప్యాకేజ్డ్, లేబుల్డ్ మిల్లెట్స్ పిండిపై ఐదు శాతం జీఎస్టీ వర్తిస్తుంది. విడిగా విక్రయించే మిల్లెట్స్ పిండిపై జీఎస్టీ పూర్తిగా మినహాయించారు.పౌష్టికాహార విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో ఆరోగ్య సృహ గల వినియోగదారుల్లో మిల్లెట్స్ పిండికి పాపులారిటీ పెరుగుతున్నది. పౌష్టికాహార వస్తువులు ప్రజలకు తేలిగ్గా అందుబాటులోకి తెచ్చేందుకు మిల్లెట్స్ పిండిపై జీఎస్టీ రేటు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే డిస్టిల్డ్ ఆల్కాహాల్‌ను పరోక్ష పన్నును మినహాయించారు. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్ (ఈఎన్ఏ)పై మాత్రం జీఎస్టీ యధావిధిగా కొనసాగుతుంది.చెరకు రైతులకు త్వరితగతిన బకాయిలు చెల్లించడానికి వీలుగా మొలాసిస్‌పై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గించేసింది. భారతీయ రైల్వేస్ సరఫరా చేసే వస్తు సేవలపైనా పన్ను విధించాలని ప్రతిపాదించింది. వాటర్ సప్లయ్, పబ్లిక్ హెల్త్, శానిటేషన్ కన్జర్వెన్సీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ స్లమ్ ఇంప్రూవ్ మెంట్ తదితర సర్వీసులపై పన్ను మినహాయించారు.జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడి పదవీ కాలం 67 ఏండ్ల నుంచి 70 ఏండ్లకు, ట్రిబ్యునల్ సభ్యుల పదవీ కాలం 65 ఏండ్ల నుంచి 67 ఏండ్లకు పెంచుతూ కౌన్సిల్ తీర్మానించింది. కంపెనీల డైరెక్టర్లు అందించే కార్పొరేట్ గ్యారంటీపైనా జీఎస్టీ మినహాయించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie