హైదరాబాద్
ఈరోజు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ రాష్ట్ర పురపాలక ఐ.టీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు మరియు పాత పెన్షన్ విధానం అమలుపై సంపూర్ణ నివేదికను అందించడం జరిగింది. మంత్రిస్థితప్రజ్ఞ తో సీపీయస్ రద్దు చేసిన రాష్ట్రాల్లో పాత పెన్షన్ అమలు అవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం రద్దు ప్రకటన కొరకు రాష్ట్రంలోని మూడు లక్షల ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారని ఎన్నికలలోపు ముఖ్యమంత్రి గారు ఈ పెన్షన్ విధంగా ఐ పై సత్వరం నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులవి ప్రతి ఏటా 2000 రెండు వేల కోట్లు షేర్ మార్కెట్ లోకి వెళ్తున్నాయని,పాత పెన్షన్ అమలు వల్ల ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నయా పైసా భారం ఉండదని విన్నవించడం జరిగింది.ఈ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్ రావులు పాల్గొన్నారు