కోరుట్ల నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపి.అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గెలుపుకు పెన్షనర్లు,వారి కుటుంబాల సభ్యులు సహకరించాలని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నారు.బుధవారం కోరుట్ల డివిజన్ కేంద్రంలో పెన్షనర్ల అసోసియేషన్ సభ్యులను హరి ఆశోక్ కుమార్ ,ఆ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం,సంఘాల ప్రతినిధులు ఇంటింటా కలిసి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి తేదీనే ఉద్యోగులకు వేతనాలు,పెన్షనర్ల కు పెన్షన్లు అందించిన విషయం గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షనర్ల కు ఆదాయం పన్ను మినహాయింపు,పాత పెన్షన్ పునరుద్ధరణ అంశాలపై సానుకూల పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం పెన్షనర్ల కోరుట్ల డివిజన్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన డివిజన్,మండలాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.పెన్షనర్ల పిలుపు పత్రికలను సబ్యులకు అందజేశారు. మెరుగైన పీ. ఆర్.సి.ఇస్తామని ,సమస్యల సత్వర పరిష్కారం కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. పీ.అర్.సి. కమిషనర్ కు 40 శాతం పైగా పీ.ఆర్.సి.ఇవ్వాలని,పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరామన్నారు.ఈ కార్యక్రమంలో టీ పెన్షనర్ల కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం,కార్యదర్శి జీ.రాజ్ మోహన్,ఉపాధ్యక్షుడు ఎం.డి.సైపోద్దీన్,కోశాధికారి ఎన్.లక్ష్మీనారాయణ,సాబితలి, రాజయ్య,రాములు,మల్కయ్య, నర్సయ్య,డివిజన్, కోరుట్ల, మేడి పల్లి,కథలాపూర్ ,మండల పెన్షనర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.