పుంగనూరు: పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అయన కిరణ్ కుమార్ రెడ్డి పై మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మాడగాడు అని ప్రస్తావించారు. కిరణ్ కుమార్ రెడ్డి నిన్ను సూటిగా అడుగుతున్న నువ్వు అమర్నాథ్ రెడ్డి కె పుట్టవా. మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే నువ్వు చెప్పిన కాణిపాకంలో నువ్వు ప్రమాణం చెయ్. ముఖ్యమంత్రిగా నువ్వు ఏ మాత్రం డబ్బులు తీసుకోకుండా న్యాయం గా పని చేసావా. నువ్వు న్యాయంగా పనిచేశావని ప్రమాణం చెయ్, నీ కండిషన్లకు ప్రమాణం చేయడానికి నేను సిద్ధమని అన్నారు.
నువ్వు ప్రమాణం చేయలేదు అంటే అమర్నాథ్ రెడ్డికి నువ్వు పుట్టలేదు అని అర్థం. శివశక్తి పాల డైరీ గురించి తప్పుడుగా వాగుతున్నావ్. హెరిటేజ్ డైరీ కన్నా శివశక్తి డైరీలో పాలకు అధిక రేటు ఇస్తున్నాం. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత నాలుగో తేదీ బ్యాగ్ సర్దుకుని టికెట్ బుక్ చేసుకుని హైదరాబాదుకు బయలుదేరుతావని అన్నారు.
Next Post