Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదు..

0

తిరుపతి: తిరుపతి పల్లెవీధిలో వైసిపి కార్యకర్తలు నిన్న రాత్రి ఒక ఓటుకు 5వేల రూపాయలు పంపిణీ చేశారు. ఒక్క ఓటుకు 5వేల రూపాయలు ఇవ్వడమేంటని మాజీ ఎంపి చింతా మోహన్ ప్రశ్నించారు. డబ్బులను యథేచ్ఛగా పంచుకుంటే తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఏం చేస్తున్నారు..? జగన్మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బులు తిరుపతిలో పంచుతున్నారా..? జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చి కేజ్రీ వాల్ కు ఎందుకు ఇవ్వడం లేదు. కేజ్రీవాల్ పట్ల మోడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. దమ్ముంటే కలికిరి పర్యటనకు వచ్చే మోడి దీనిపై సమాధానం చెప్పాలి. పత్రిక స్వేచ్ఛకు సంకెళ్లు వేసిన వ్యక్తి మోడీ. సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదు. కేజ్రీవాల్ తప్పు చేస్తే సీఎం గా కొనసాగే అర్హత లేదా..? అదే ఎపి సిఎం తప్పు చేస్తే సిఎంగా కొనసాగవచ్చా..కోర్టు తీర్పులు గందరగోళానికి తెరతీస్తున్నాయి. కేజ్రీవాల్ కు ఒక తీర్పు.. జగన్ కు మరో తీర్పా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమాధానం చెప్పాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie