కొనసీమ :
2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని అప్పటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు చెప్పారు. తనను ఎన్నికల బరిలోకి రావాల్సిందిగా కొన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాయని త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కోడి కత్తి శ్రీను వెల్లడించారు. అమలాపురం అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలో దిగుతానని ఆయన చెప్పారు. జైల్లో డిగ్రీ పూర్తి చేయడంతో పాటు ఐదు వేల పుస్తకాల వరకు చదివానని సమాజంలో పేదలకు న్యాయం జరగడం లేదని దానికోసమే చట్టసభకు వెళ్లాలని ఆలోచన కలిగిందన్నారు
Next Post