కమాన్ పూర్ :
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో ఎస్సారెస్పీ అధికారులు సాగునీరు విడుదల చేయడం జరిగిందని కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అన్నారు. మంగళవారం జూలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం రోజున కమాన్ పూర్ మండల రైతులు శ్రీధర్ బాబుకు సాగునీటి కొరకు రైతులను కలవడం జరిగింది. దీంతో శ్రీధర్ బాబు వెంటనే జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపి వెంటనే సాగునీరు విడుదల చేసి రైతులకు అందేలా చూడాలని శ్రీధర్ బాబు కలెక్టర్ ను ఆదేశించారు. 500 క్యూసెక్కుల సాగునీటిని అదనంగా విడిపించి డి 83 నుండి వచ్చిన ఎల్ 31 ద్వారా కమాన్ పూర్ మండలం తో పాటు పలు గ్రామాల రైతులకు సాగునీరు అందించాలని కోరారు.
సాగునీరు విడుదల చేయడంతో రైతుల పక్షాన వైనాల రాజు మంత్రి శ్రీధర్ బాబుకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరోగ్యానికి అమలుకు శ్రీకారం చుట్టడం జరిగిందని అందులో భాగంగా భద్రాద్రి రాముడు సన్నిధిలో ఇందిరమ్మండ్ల గృహ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని రాజు అన్నారు ఇప్పటికే ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఉచిత ఆర్టీసీ ప్రయాణం 500 కే గ్యాస్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని నిరూపిస్తుందని స్పష్టం చేశారు.
Prev Post