ఆళ్లగడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరగోడ్ల హుస్సేన్ బాష ఈరోజు ఇంటింటికి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం లో నరసాపురం మరియు రుద్రవరం మండలం లో ఆళ్లగడ్డ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బరగోడ్ల హుస్సేన్ బాషా పలు గ్రామలలో, మండలాలల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆళ్లగడ్డ MLA అభ్యర్థి ని అలాగే నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జెంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించడంతో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, రైతులకు రెండు లక్షల రుణమాఫీ , కేజీ టు పి జి విద్య , ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలు రోజువారి కూలి,కాంగ్రెస్
పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే నల్ల, చట్టాలను రద్దు చేస్తాంపాత పెంక్షన్ విధానాన్ని అమలు చేస్తాం.అనేక సంక్షేమ పథకాలు అందుతాయని ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెస్లీ, సిరివెళ్ల మండలం అధ్యక్షులు పసుపులేటి లక్ష్మినరసింహుడు, రుద్రవరం మండలం అధ్యక్షులు శ్రీనివాసులు, డీసీసీ కార్యదర్శిలు మహబూబ్ బాష, నజీర్ బాష, సిరివెళ్ల మండలం కన్వీనర్ సలీం,వీరేష్ యాదవ్,ఆసిఫ్,అన్సార్, భాష,నవాజ్ తదితరులు పాల్గొన్నారు
Prev Post