ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలి,జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష
జగిత్యాల,
పారిశుద్ద్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమంలో భాగంగా శనివారం జగిత్యాల రూరల్ మండలం చలిగల్ గ్రామ పంచాయతిని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్ల పరిశుభ్రత, డ్రైనేజి పూడిక తీత పనులు, మురికి కాల్వలలోని దోమల నివారణ, మరియు పిచ్చి మొక్కల నివారించుటకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
గ్రామ పంచాయతీలోని ఎస్.ఎస్.జి. మహిళలు, అంగన్ వాడి మహిళలు, ఆశా వర్కర్లతో, గ్రామ పెద్దలతో సమన్వయం చేసుకొని గ్రామ పంచాయతి అభివృద్దికి సహకరించి గ్రామ పంచాయతి పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల పరిసరాల పరిశుభ్రతతో పాటు గ్రామా పరిశుభ్రత కూడా సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. చెత్త వేసేటప్పుడు తడి చెత్త, పొడి చెత్త రెండు వేరు వేరుగా గా చేసి ట్రాక్టర్ లో వేయాలని, అలాగే ప్రతీ ఇంటి వద్ద ఇంకుడు గుంటలు నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు.
స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్ ఎన్ని వేల కోట్లు సిద్ధం చేశారో తెలుసా
ఆశా వర్కర్లు, అంగన్ వాడీ మహిళలతో, ఏ.ఎన్.ఎం.లతో సిజేరియన్ లేకుండా గర్భిణిలకు సాధారణ డెలివరీలు అయ్యే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అదే విధంగా కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారు విధిగా కళ్ళజోడు వాడాలని కలెక్టర్ సూచించారు. ఎండ ఎక్కువగా ఉన్నందున వృద్దులు, చిన్న పిల్లలు బయట తిరగకూడదని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. గ్రామ అభివృద్దికి ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధించిన జిల్లా అధికారులు వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు