విజయవాడ కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మూడు పార్టీలు ఏకమయ్యారని కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామని మోసపూరిత హామీలు ఇస్తారని వారి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే మళ్ళీ సీఎం గా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి అని అన్నారు.