తిరుపతి వైసిపి ప్రచారాన్ని గ్రామస్తుల అద్దుకున్న సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వేళ్తే తిరుపతి జిల్లా వడమాల పేట మండలం పరిధిలోని పూడి పంచాయితీ వేమాపురం గ్రామంలో వైసిపి ప్రచార రథాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. మంత్రి రోజా ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోకి వస్తుందని ముందుగా ప్రచార రథం వచ్చింది. అయితే తమ గ్రామానికి ఏమి మేలు చేశావని ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నావని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజారాధాన్ని గ్రామంలో రాకుండా వారు అడ్డుకున్నారు. దీంతో పక్క గ్రామంలో ఉన్న మంత్రి రోజా గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు పోలీసులు సహాయం తీసుకున్నట్లు సమాచారం. అప్పటికి గ్రామస్తులు శాంతించకపోవడంతో ప్రచార రథం వెనుతిరిగింది. ఇది జరుగుతున్న గాని మంత్రి రోజా గ్రామంలోకి అడుగు పెట్టింది. పోలీసులు సహాయంతో గ్రామంలో ప్రచార రథం పైకెక్కి ఓట్లని అభ్యర్థించే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే రగాలిరిలోపోతున్న గ్రామస్తులు మంత్రి రోజా ప్రచారాన్ని ఇంటి తలుపులు మూసేసి నిరసన తెలిపారు. కేవలం 10 నిమిషాల్లో ప్రచారం ముగించుకుని అర్కే. రోజా వెనుతిరిగారు.