పెడన కాంగ్రెస్ శాసనసభ అభ్యర్థి సొంటి నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు పెడన మండలం నందమూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గడపగడప సందర్శిస్తూ కార్యకర్తల నడుమ ముందుకు సాగారు. ఈ సందర్భంగా సొంటి నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే ఈరోజు పెడన నియోజవర్గంలో కనబడుతుంది. వైసీపీ పాలనలో అక్రమాలు దోపిడీలు అరాచకాలు తప్ప జరిగింది ఒరిగింది ఏమీ లేదని సొంటి నాగరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కచ్చితంగా అవుతారు తొలి సంతకం ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్ గాంధీ మాట ఇవ్వడం జరిగింది. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీర్చిదిద్దేలాగా రాహుల్ గాంధీ ముందుంటారని సొంటి నాగరాజు పేర్కొన్నారు. అలాగే ఈ పెడన నియోజవర్గంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కూడా త్వరిత గతిన పరిష్కరించి పెడన అభివృద్ధి తీర్చిదిద్దేలాగా తన వంతు ప్రయత్నం చేస్తానని సొంటి నాగరాజ్ నియోజకవర్గ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…