Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మహిళను వేధించడం బాధాకరం: టీడీపీ

వైసీపీ నేతపై చర్యలు తీసుకోవాలి : బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

0

నందికొట్కూర్
ముస్లిం మైనార్టీ మహిళను వేధించడం బాధాకరమని నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నందికొట్కూరులోని ముబారక్ ఫంక్షన్ హాల్ ఏరియాలో నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి తెలుసుకొని బాధిత కుటుంబానికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మతాలకు అతీతంగా ముక్త కంఠంతో ఖండించాలని అన్ని పార్టీల నాయకులకు పిలుపునిచ్చారు.వైసీపీకి చెందిన కో ఆప్షన్ మెంబర్ శ్రీనివాసరెడ్డి గురువారం రాత్రి ముస్లిం మహిళపై అనుచితంగా ప్రవర్తించిన తీరును నియోజకవర్గ టీడీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. అదేవిధంగా ముస్లింలకు 40 ఏళ్లుగా ప్రాధాన్యం ఇస్తూ.. వారికి న్యాయం చేసిన ఏకైక పార్టీ తమదేనని తెదేపా ఆయన అన్నారు. ముస్లింలో చాలా మంది పేదలు ఉన్నారని గుర్తించిన ఎన్టీఆర్ 1985లో దేశంలోనే మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించారు. హజ్ యాత్రకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని..హైదరాబాద్‌లో హజ్ హౌస్ నిర్మించి విమాన సదుపాయాన్ని కల్పించాం.

చంద్రబాబు కేసులు… మళ్లీ వాయిదాలు

రాష్ట్రం విడిపోయాక కడప, విజయవాడలో హజ్ హౌస్‌ల నిర్మాణం చేపట్టి 90 శాతం పూర్తి చేశాం. కానీ వాటిని ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. సమైక్య రాష్ట్రంలో ఉర్దూ యూనివర్సిటీని హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. విభజన తర్వాత కర్నూలుకు తెచ్చాం. ఖురాన్ స్ఫూర్తితో పేద ముస్లింలైన 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చాం. దుకాన్ మకాన్, దుల్హన్ పథకాలను ప్రవేశపెట్టాం. 33 వేల మందికి దుల్హన్ పథకం ద్వారా రూ.165 కోట్లు ఆర్థిక సాయం ఇచ్చిన ఏకైక పార్టీ తెదేపా. విదేశీ విద్య కింద 527 మందిని విద్యార్థులను విదేశాలకు పంపించాం. కానీ, ఈ ప్రభుత్వం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. ఒక్క మైనారిటీ సోదరుడికైనా ఆర్థిక సాయం అందించిందా..? ఒక్క మసీదైనా కట్టారా?” అని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. జగన అధికారంలోకి వచ్చిన వెంటనే దుల్హన పథకాన్ని నీరుగార్చారన్నారు. ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ చాపచుట్టేసి ముస్లింలకు తీరని అన్యాయం చేశారన్నారు. ముస్లిం హక్కులకు భంగం కలిగించిన ఎనఆర్‌సీ, సీఏఏ, తదితర చట్టాల విషయంగా బీజేపీ అడుగులకు జగన మడుగులొత్తారన్నారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలు వైసీపీకి వ్యతిరేకంగా నిలవాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie