రంగారెడ్డి మహిళలు సాధికారతకు కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విశేషం కృషి చేస్తుందని జాతీయ మహిళా మోర్చ్ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ అన్నారు. సమాజం సగభాగం మైన మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించెందుకు మోడీ కృషి అభినందనీయం తెలిపారు. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ ఏర్పాటు చేసిన నారీ శక్తి సమావేశానికి శ్రీనివాసన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈసందర్భంగా చేవెళ్ల బీజేపీ పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీత రెడ్డి మాట్లాడుతూ మహిళ అభ్యున్నతి కోసం ముద్రా రుణాలు ఇవ్వడంతోపాటు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకొవడం జరిగిందని ఆమె తెలిపారు. మహిళలు అభ్యున్నతి కేంద్ర అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.