మిరప పంట వేసి నాలుగు లక్షలు నష్టపోయిన రైతు వైరస్ ప్రభావం వల్ల మూడు ఎకరాల మిరప పంట నాశనం
దేవనకొండ
దేవనకొండ మండల పరిధిలోని నెల్లిబండ గ్రామంలో లింగన్న అనే రైతు మూడు ఎకరాల మిరప పంటను సాగు చేశాడు. రెండు నెలల నుండి పైరుని కంటికి రెప్పల తన కన్న కొడుకుల కాపాడుకున్నాడు. తనకు ఉన్న ఆశలని ఆ పంట పైన పెట్టుకున్నాడు. కానీ పాపం తన దురదృష్టావశాతం , తన ఆశలు నిరాశలయ్యేలాగా మిరప పంటకువైరస్ అనే మహమ్మరి అంటుకుంది.
ఎన్ని రసాయన మందులు పిచ్చికారి చేసిన, వేల రూపాయలు ఖర్చులు పెట్టి రసాయన మందులు రసాయన ఎరువులు పొలానికి వేసిన ఫలితం లేకపోయింది. చేతికి వచ్చిన పైరును ఎలాగైనా కాపాడుకోవాలి అని గట్టి సంకల్పంతో వేలకొద్దీ అప్పులు చేసి, రసాయన మందులు వాడిన ప్రయోజనం లేకుండా పోయిందని, రైతు లింగన్న తన భార్య విరుపాక్షమ్మ కంటతడి పెట్టుకున్నారు . దాదాపుగా 4 లక్షల నుండి 5 లక్షల దాకా పెట్టుబడి పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. అందుకని ఆ రైతు ఎంత చేసినా పంటను కాపాడుకోలేము అని తెలుసుకొని మూడు ఎకరాల మిరప పంటను ట్రాక్టర్ తో దున్నించి తీసివేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం మా పైన దయవుంచి మాకు జరిగిన నష్టానికి ప్రభుత్వం రైతులను దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని మా కుటుంబాన్ని మీ దయగల హృదయంతో మా నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.