Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

యువతతో లోకేష్ ముఖాముఖి

0

అమలాపురం
కొనసీమ జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. . ఈ సందర్భంగా లోకేశ్ ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ఆక్వా రైతులు తమ సమస్యలను  లోకేశ్ కు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ… ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని అన్నారు. జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించాల్సిన తీవ్ర
పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు సమస్యలు లేకుండా చేస్తామని…. సీడ్, ఫీడ్, కరెంటు చార్జీలు తగ్గేలా చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. ఆక్వా  ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. కాగా, లోకేశ్ యువగళం నేడు అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో కొనసాగనుంది. కొన్నిరోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసిన ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు టీడీపీలో చేరగా, వారికి లోకేశ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. భట్నవల్లిలో లోకేశ్ యువతతో  ముఖాముఖి నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie