మంచిర్యాల
పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గురువారం నాడు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి వారితో వాకింగ్ చేస్తూ ఆత్మీయంగా పలకరించారు. రానున్నపార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేయాలని, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపర్చాలని, భారతదేశ మరింత అభివృద్ధి చెందాలంటే మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని అన్నారు. మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు వేసి నన్ను గెలిపించాలని కోరారు, ఈ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వేరబెల్లి రఘునాధ్ పాల్గోన్నారు. వాకింగ్ అనంతరం వాకర్స్ అందరితో కలిసి యోగా చేశారు. యోగా అనేది అతి ప్రాచీనమైన పద్ధతి అని ప్రతి ఒక్కరూ యోగ చేయాలనియోగ చేయడం వలన , శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసనం జరుగుతుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో యోగాకి గుర్తింపు తెచ్చినటువంటి మహా నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని అన్నారు.
ఇడుపుల పాయకు రాహుల్ , సోనియా ?
2014 సెప్టెంబర్ 27న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకోవాలని ప్రతిపాదించగా ఐక్యరాజ్యసమితి ఆమోదించి జూన్ 21న అంతర్జాతీయ యోగ డే జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.
వారి వెంట పెద్దపల్లి పార్లమెంటు కన్వీనర్ వెంకటేశ్వర్లు గౌడ్, మంచిర్యాల జిల్లా వర్ధన్, సీనియర్ నాయకులు తుల మధుసూదన్, మల్లారెడ్డి, తిరుపతి రెడ్డి, వాకర్స్ ఏసుకురి రాజమల్లు, లక్ష్మణ్, తిరుపతి, వాకర్స్ అందరు ఉన్నారు.