విజయవాడ
మేమంతా సిద్దం బస్సుయాత్రలో గంటావారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రిశ్రీ వైయస్.జగన్ సమక్షంలో జనసేన,తెలుగుదేశం పార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు చేరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి… పార్టీలోకి సీఎం ఆహ్వానించారు. జనసేన నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి విజయవాడ పట్టణ ఉపాధ్యక్షుడు వెన్న శివశంకర్, పశ్చిమ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు షేక్ అమీర్ బాషా, పి శ్రీనివాసరావు, ఎస్ రాముగుప్తా, పిల్లా వంశీకృష్ణ, సోమి గోవిందరావు, ఎం.హనుమాన్, సయ్యద్ మొబీనా, జెల్లి రమేష్, పలువురు ఇతర నేతలు చేరారు.
Next Post