కర్నూలు
కర్నూలు నగరంలోని ముస్లిం మైనార్టీ మత పెద్దలు తబ్లీ జమాత్ లు జుబేర్ మౌలానా, జాకీర్ మౌలానా , మన్సూర్ మౌలానా మౌలానా అబ్దుల్ రెహమాన్ దర్గా సాహెబ్ లు సోహేల్ హఫీజ్ , రోజా దర్గా దాదా సాహెబ్ జగనన్న చేసిన అభివృద్ధి మరియు సంక్షేమం చూసి ఆకర్షితులై కర్నూల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏ ఎం డి ఇంతియాజ్ ని వారి నివాసంలో కలిసి వారికి సంపూర్ణ మద్దతు తెలియచేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు దేశంలో ఎక్కడ లేని విధంగా 4% రిజర్వేషన్ కల్పించిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మాత్రమే అని జగనన్నకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని కర్నూల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏ ఎం డి ఇంతియాజ్ హామీ ఇవ్వడం జరిగింది.