నంద్యాల రాష్ట్రంలో 14 సంవత్సరాలు మోసపు, అబద్దపు పాలన చేసిన మోసాల చంద్రబాబు నాయుడు మరియు కూటమి పార్టీలకు ప్రజలు రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడాలని నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవిసింగారెడ్డి పిలుపు నిచ్చారు. పట్టణంలోని 23వ వార్డులో కౌన్సిలర్ రాజ్యలక్ష్మి, వార్డు ఇంచార్జి పార్థసారథి ఆద్వర్యంలో నాగిని రవి సింగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు పాలనలో చేసిన మోసాలు, నేడు జగనన్న ప్రభుత్వంలో ప్రజలు చేసిన మంచిని ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. వీరికి అడుగడుగునా హారతులతో ఘన స్వాగతం పలికారు వార్డు ప్రజలు. ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ….మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచరణకు సాధ్యం కాని హామీలతో గత 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని మోసాలతో పాలించారని, వీరి మోసాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. రానున్న ఎన్నికల్లో అబద్దపు, మోసాల చంద్రబాబు నాయుడిని, కూటమి పార్టీలకు చరమగీతం పాడాలని పిలుపు నిచ్చారు. నంద్యాలలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి, చేపట్టనున్న అభివృ ద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నంద్యాలలో 21 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ నంద్యాల ప్రజలకు, నంద్యాలకు ఏమి చేశారో ప్రజలు అడగాలని కోరారు. రానున్న మేనెల 13వ తేది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మురళి వైఎస్ఆర్సిపి నాయకులు పుల్లయ్య, శివకుమార్, గౌతమ్, శ్రీను, చిన్న ,నరసింహులు, సాయి, అభిరేని, మోహన్, శిల్ప రమణ, అన్వర్ భాష కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు